ఎన్నికల బరిలో సినీ నటి రాధిక

ఎన్నికల బరిలో సినీ నటి రాధిక

Radhika Sarathkumar : తమిళనాడులో రాజకీయ పరిణామాలు హీటెక్కిస్తున్నాయి. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే..కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి నుంచే పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే సినీ నటి రాధిక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని స్వయంగా..ఆమె భర్త ఎస్ఎంకే నేత శరత్ కుమార్ వెల్లడించడం విశేషం. శరత్ కుమార్ నేతృత్వంలోని సమత్తువ మక్కల్ కట్చి మహిళా విభాగం ఇన్ ఛార్జీగా రాధిక వ్యవహరిస్తున్నారు. అన్నాడీఎంకే కూటమిలోనే ఉన్నామని, అధిక సీట్లు ఆశిస్తున్నట్లు..ప్రత్యేక గుర్తుపై తాము పోటీ చేయడం జరుగుతుందన్నారు.

మరోవైపు…కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న కరాటే త్యాగరాజన్…బీజేపీలో చేరనున్నారని సమాచారం. రజనీకాంత్ పార్టీ ఏర్పాటు చేస్తారని…ఆయన ఆశించారు. కానీ..అది కార్యరూపం దాల్చకపోయేసరికి..కాషాయ కండువా కప్పుకోనున్నారని మద్దతుదారులు వెల్లడిస్తున్నారు.

ఇదిలా ఉంటే…కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రచారం చేపడుతున్నారు. మలి విడత ప్రచారానికి సిద్ధమయ్యారు. 14 నుంచి జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే..14వ తేదీ..ప్రధాని రాష్ట్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. దీంతో..రాహుల్ పర్యటనలో స్వల్పమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈనెల పదిహేను తర్వాత..రాహుల్ పర్యటన తేదీ ప్రకటించనున్నారు.