మాటకు మాట : రాహుల్‌గాంధీ స్వ‌లింగ సంప‌ర్కుడు: స్వామీ చ‌క్ర‌పాణి

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 11:23 AM IST
మాటకు మాట : రాహుల్‌గాంధీ స్వ‌లింగ సంప‌ర్కుడు: స్వామీ చ‌క్ర‌పాణి

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వ‌లింగ సంప‌ర్కుడు అంటూ అఖిల భార‌తీయ హిందూ మ‌హాస‌భ అధ్య‌క్షుడు స్వామీ చ‌క్ర‌పాణి ఆరోపించారు. గాడ్సే, సావ‌ర్క‌ర్ స్వ‌లింగ సంప‌ర్కులు అని ఇటీవ‌ల కాంగ్రెస్ ఆరోపించింది.”హౌ బ్రేవ్ ఈజ్ వీర్ సావర్కర్ “(‘వీర సావర్కర్ కిత్నే వీర్)అనే పేరుతో ప్రచురించిన సేవాద‌ళ్ బుక్‌లెట్‌లో కాంగ్రెస్ ఆ ఆరోప‌ణ‌లు చేసింది. దీనిపై హిందూ మ‌హాస‌భ అధ్య‌క్షుడు రియాక్ట్ అయ్యారు. గాడ్సే, సావ‌ర్క‌ర్‌పై చేసిన ఆరోప‌ణ‌లను స్వామి చ‌క్ర‌పాణి ఖండించారు. రాహుల్ గాంధీ కూడా హోమోసెక్సువ‌ల్ అని విన్నానని స్వామీజీ వ్యాఖ్యానించారు. 

కాగా..ఈ బుక్ లెట్ ను నిషేధించాలని వినాయక్ దామోదర్ సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని కోరారు.  భోపాల్‌లో జరుగుతున్న పది రోజుల శిక్షణా శిబిరంలో ఈ బుక్‌లెట్‌ను పంచిన కాంగ్రెస్‌ సేవాదళ్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
 
హిందూ మహాసభ సహ-వ్యవస్థాపకుడైన వినాయక్ దామోదర్ సావర్కర్‌కు గాంధీ హంతకుడైన నాథూరామ్ గాడ్సేతో ‘శారీరక సంబంధం’ ఉందని ఆ బుక్‌లెట్‌‌‌ పేర్కొంది. లారీ కొల్లిన్స్, డొమినిక్ లపైరే రాసిన ‘ఫ్రీడం ఎట్ మిడ్‌నైట్’ పుస్తకంలోని 423వ పేజీని ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. 

‘సావర్కర్‌ ప్రతిష్టను దిగజార్చేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందనీ..అనుచిత ఆరోపణలు చేస్తూ..కాంగ్రెస్ దేశంలో అరాచకవాదాన్నివ్యాప్తి చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సేవాదళ్‌పై ప్రభుత్వం తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఐపీసీలోని సెక్షన్ 120, 500, 503, 504, 505, 506 కింద కేసులు నమోదు చేసి..ఆ బుక్‌లెట్ ప్రభుత్వం నిషేధించాలని రంజిత్ సావర్కర్ డిమాండ్ చేశారు.