Karnataka Elections Result: రాహుల్ గాంధీ ‘జోడో యాత్ర ’ సాగిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్నిచోట్ల గెలిచిందో తెలుసా?
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలోనూ సాగింది. అయితే, ఆ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ యాత్ర సాగింది? యాత్ర సాగిన ఎన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
Bharat Jodo Yatra: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కన్నడనాట విజయం సాధించారు. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. అధికార పీఠాన్ని దక్కించుకోవాలంటే 113 స్థానాలు అవసరం ఉంది. శనివారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 135 (42.88 ఓట్ల శాతం) స్థానాల్లో విజయం సాధించి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బీజేపీ కేవలం 66 (36 ఓట్ల శాతం) స్థానాలకే పరిమితం అయింది. ఇక జేడీఎస్ తన స్థాయికి తగ్గట్లు రాణించలేక పోయింది. ఆ పార్టీ కేవలం 19 (13.29 ఓట్ల శాతం) స్థానాలకే పరిమితం అయింది. ఇతరులు నాలుగు (8.1 ఓట్ల శాతం) స్థానాల్లో విజయం సాధించారు.
Karnataka Election Result 2023: కర్ణాటకలో ప్రాంతాల వారీగా ఫలితాలు ఇలా.. 2018లో ఎన్ని? 2023లో ఎన్ని?
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలోనూ సాగింది. అయితే, ఆ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ యాత్ర సాగింది? యాత్ర సాగిన ఎన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు? అనే విషయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ ప్రకారం.. రాహుల్ గాంధీ జోడో యాత్ర కర్ణాటక రాష్ట్రంలో 22 రోజులపాటు 500 కిలోమీటర్లు సాగింది. ఈ యాత్ర ఎన్నికల్లో మంచి ఫలితాలనే చూపించిందని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాహుల్ యాత్ర కొనసాగగా.. 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. 2018 ఎన్నికల్లో ఈ 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఐదు నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా.. రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ కారణంగా అదనంగా పది నియోజకవర్గాల్లో ఈసారి కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
Karnataka Election Results 2023: కర్ణాటక విక్టరీ.. కాంగ్రెస్కి మెడిసిన్లా మారనుందా?
భారత్ జోడో యాత్ర 20 నియోజకవర్గాల్లో సాగగా.. అందులో 15 చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మూడు చోట్ల జేడీఎస్, రెండు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ 20 నియోజకవర్గాల్లో 2018 ఎన్నికల ఫలితాలను ఓసారి పరిశీలిస్తే.. 2018 ఎన్నికల్లో ఈ 20 నియోజకవర్గాల్లో బీజేపీ తొమ్మిది చోట్ల విజయం సాధించింది. జేడీఎస్ ఆరు చోట్ల విజయం సాధిస్తే.. కాంగ్రెస్ మాత్రం కేవలం ఐదు నియోజకవర్గాల్లోనే విజయం సాధించింది. తాజా గణాంకాలను బట్టిచూస్తే భారత్ జోడో యాత్ర ప్రభావం చూపినట్లేనని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
कर्नाटक में #BharatJodoYatra का यह सीधा असर है। मोटे तौर पर पार्टी को एकजुट करने, कैडर में जोश भरने और कर्नाटक चुनाव के लिए नैरेटिव सेट करने में यात्रा की ज़बरदस्त भूमिका रही।
भारत जोड़ो यात्रा के दौरान कर्नाटक के लोगों के साथ @RahulGandhi ने कई बातचीत की। इन बातचीत के आधार पर… pic.twitter.com/3zxmIRcRj2— Jairam Ramesh (@Jairam_Ramesh) May 13, 2023