Rahul Gandhi : పిల్లలు పుట్టరని తెలిసే రాహుల్ పెళ్లి చేసుకోలేదు : బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కర్ణాటక బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి పిల్లలు పుట్టరని తెలిసే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు.

Rahul Gandhi :  పిల్లలు పుట్టరని తెలిసే రాహుల్ పెళ్లి చేసుకోలేదు : బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Rahul gandhi not marrying as he can’t have kids

Rahul Gandhi : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కర్ణాటక బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి పిల్లలు పుట్టరని తెలిసే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు అంటూ సోమవారం (మార్చి 6,2023) రామనగర్ లో నిర్వహించిన జన సంకల్ప యాత్రలో పాల్గొన్న సందర్భంగా కర్ణాటక బీజేపీ ఎంపీ, ఆపార్టీ చీఫ్ నళిన్ కుమార్ కటిల్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. బీజేపీలో అందరికీ ఉన్నట్టుగా నళిన్ కుమార్‌కు కూడా మానసిక వ్యాధి ఉందని అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కౌంటర్ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. కోవిడ్ టీకాలు వేయించుకుంటే నంపుసకత్వానికి దారి తీస్తుందని ప్రతిపక్ష నాయకులు నమ్ముతున్నారని కూడా నళిన్ కుమార్ వ్యాఖ్యానించారు.

నళిన్ కుమార్ జన సంకల్ప యాత్రలో మాట్లాడుతూ..కరోనా వ్యాక్సిన్ వేయించుకోవద్దని అది వేయించుకుంటే పిల్లలు పుట్టరని రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య ప్రచారం చేశారు అంటూ ఆరోపించారు. కానీ వారు మాత్రం సీక్రెట్ గా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని అన్నారు. పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టే రాహుల్ గాంధీ వివాహం చేసుకోలేదని..ఇదే విషయాన్ని తమ ఎమ్మెల్సీ మంజునాథ్ నాతో అన్నారు అంటూ వ్యాఖ్యానించారు.

నళిన్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీలో అందరికీ ఉన్నట్టుగా నళిన్ కుమార్‌కు కూడా తీవ్రమైన మానసిక వ్యాధి ఉన్నట్టుగా తెలుస్తోందని..ఈ వ్యాధి మొత్తం బీజేపీ నేతలందరికి పాకింది అంటూ ఎద్దేవా చేశారు. కటిల్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే అతనికి నిజంగా తీవ్రమైన మానసిక వ్యాధి ఉన్నట్లుగా తెలుస్తోందని..ఈ వ్యాధి పార్టీ మొత్తానికి వ్యాపిస్తున్నట్లుగా ఉందని కాబట్టి త్వరగా కోలుకో బీజేపీ అంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ట్వీట్టర్ వేదికగా సెటైర్ వేశారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సర్జేవాలా కూడా కౌంటర్ఇస్తూ.. బీజేపీ సర్కస్‌లో కటీల్ ఒక జోకర్..ఆయన మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ పేర్కొన్నారు.

కాగా కటిల్ చేసిన ఈ వ్యాఖ్యలపై కొంతమంది బీజేపీ నేతలు అసహనం వ్యక్తంచేశారు. ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని అన్నట్లుగా తెలుస్తోంది. కాగా కటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం ఇదేం మొదటిసారి కాదు. గతంలో స్థానిక సమస్యల గురించి బీజేపీ కార్యకర్తలు మాట్లాడిన సందర్భంలో రోడ్ల సమస్యలు…మురుగునీటి సమస్యలు అంటూ ఇటువంటి విషయాల గురించి మాట్లాడటం మానేయండి ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు అని కొట్టిపారేశారు.అదే సమయంలో ‘లవ్ జీహాద్’ వంటి విషయలపై ఫోకస్ పెట్టండీ అంటూ వ్యాఖ్యానించారు.