ఢిల్లీలో ఆప్-కాంగ్రెస్ పొత్తు!

  • Published By: venkaiahnaidu ,Published On : March 26, 2019 / 10:00 AM IST
ఢిల్లీలో ఆప్-కాంగ్రెస్ పొత్తు!

ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ పొత్తుకి అంతా రెడీ అయినట్లు తెలుస్తోంది.త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశముంది. రెండు పార్టీలకు చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు కానీ ముందు ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీని ఓడించాలని ఢిల్లీ కాంగ్రెస్ ఇంఛార్జి పీసీ చాకో తెలిపారు.ఆప్-కాంగ్రెస్ పొత్తుపై పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీదే తుది నిర్ణయమని మంగళవారం(మార్చి-26,2019)చాకో తెలిపారు.

సోమవారం తన నేతృత్వంలో ఢిల్లీ కాంగ్రెస్ సీనియర్ నేతలతో రాహుల్ సమావేశమయ్యామని,చర్చలు ముగిశాయని,పార్టీ ఫైనల్ డెసీషన్ తీసుకుంటుందని,వీలైనంత త్వరలో ప్రకటన వెలువడుతుందని చాకో తెలిపారు.అయితే ఇప్పటివరకు ఆప్ తో తాము మాట్లాడలేదని,పొత్తు అవసరమా లేదా అన్న తమ పార్టీ పొలిటికల్ స్టాండ్ పైనే తాము మొదటగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మే-12న ఢిల్లీ సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి.