Sonia Gandhi: భారత్ జోడో యాత్రను వదిలి ఢిల్లీకి చేరిన రాహుల్

రొటీన్ చెకప్‌లలో భాగంగానే సోనియా ఆసుపత్రిలో చేరినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సోనియా ఆరోగ్యం పరిశీలిస్తున్న డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపిన వివరాల ప్రకారం.. చాతి సంబంధిత విభాగంలో సోనియా గాంధీ చేరారని, తనతో పాటు తన బృందం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.

Sonia Gandhi: భారత్ జోడో యాత్రను వదిలి ఢిల్లీకి చేరిన రాహుల్

Rahul left the trip to India and reached Delhi

Sonia Gandhi: తన తల్లి సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరడంతో భారత్ జోడో యాత్రను వదిలి రాహుల్ గాంధీ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం ఈ యాత్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాగుతోంది. అయితే సోనియా ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిందనే విషయం తెలియగానే, అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రికి రాహుల్ వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ వెంట ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఢిల్లీకి చెరుకున్నారు. సోనియా రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్‭తో బాధపడుతున్నారు.

Pakisatan: 60 మందికి తండ్రి అయిన ఓ పాకిస్తానీ, నాలుగోసారి పెళ్లికి రెడీ అయ్యాడు

రొటీన్ చెకప్‌లలో భాగంగానే సోనియా ఆసుపత్రిలో చేరినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. సోనియా ఆరోగ్యం పరిశీలిస్తున్న డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపిన వివరాల ప్రకారం.. చాతి సంబంధిత విభాగంలో సోనియా గాంధీ చేరారని, తనతో పాటు తన బృందం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. జూన్ నెలలో సైతం ఇదే ఆసుపత్రిలో సోనియా చేరారు. ఆ సమయంలో ఆమెకు కొవిడ్ సోకడంతో ఇక్కడే చికిత్స తీసుకున్నారు. జూన్ 12న ఆసుపత్రిలో చేరగా, జూన్ 18న డిశ్చార్జీ అయ్యారు. ఆ తర్వాత కూడా కోవిడ్ అనంతరం సమస్యలతో చెకప్‌లు చేయించుకున్నారు. కొద్ది నెలల క్రితమే ఆమె వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లారు. ఇటీవల కర్ణాటక, ఢిల్లీలో భారత్ జోడో యాత్ర ప్రవేశించినప్పుడు రాహుల్ గాంధీతో కలిసి కొద్దిసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ తర్వాత నుంచి ఆరోగ్య పరీక్షలు తరుచూ చేసుకుంటున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Delhi car horror: అంజలి స్నేహితురాలిపై విమర్శల వెల్లువ.. నువ్వేం స్నేహితురాలివి అన్న స్వాతి మాలివాల్