Notice To Hanuman : ఆంజనేయస్వామికి నోటీసిచ్చిన రైల్వే అధికారులు.. 10 రోజుల్లోగా గుడిని ఖాళీ చేయాలని హుకూం జారీ
జార్ఖండ్లో విచిత్ర ఘటన జరిగింది. దేవుడికి అధికారులు నోటీసు పంపించారు. ఏకంగా ఆంజనేయ స్వామికే రైల్వే అధికారులు నోటీసులిచ్చారు. 10 రోజుల్లోగా గుడిని ఖాళీ చేయాలని హుకూం జారీ చేశారు. లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జనం విస్తుపోతున్న ఈ ఘటన ధన్బాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
Notice To Hanuman : జార్ఖండ్లో విచిత్ర ఘటన జరిగింది. దేవుడికి అధికారులు నోటీసు పంపించారు. ఏకంగా ఆంజనేయ స్వామికే రైల్వే అధికారులు నోటీసులిచ్చారు. 10 రోజుల్లోగా గుడిని ఖాళీ చేయాలని హుకూం జారీ చేశారు. లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. జనం విస్తుపోతున్న ఈ ఘటన ధన్బాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే.. జార్ఖండ్లోని బెరక్బందల్ ఖాటిక్ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన ఖాటిక్ తెగ ప్రజలు నివసిస్తున్నారు.
వీరు గత 20 ఏళ్లుగా కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. రైల్వేకు చెందిన స్థలంలో అక్రమంగా నివసిస్తున్నందున తక్షణమే గుడిసెలు ఖాళీ చేసి వెళ్లాలని రైల్వే అధికారులు నోటీసులిచ్చారు. ఇదే వరుసలో ఇక్కడే ఉన్న హనుమాన్ మందిరంలో ఉన్న ఆంజనేయుడికి కూడా నోటీసు ఇచ్చారు. 10 రోజుల్లో గుడి ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Muslim man donates land: హనుమంతుడికి గుడి కట్టడానికి తన భూమిని ఇచ్చిన ముస్లిం వ్యక్తి
రైల్వే ఇచ్చిన నోటీసులో ‘హనుమాన్ జీ’ అని స్పష్టంగా రాసి ఉండటం కనిపిస్తుంది. ‘మీరు తమ దేవాలయాన్ని రైల్వే భూమిలో నిర్మించుకున్నారు. మీరు అక్రమంగా ఆక్రమించుకున్నందున ఖాళీ చేయాలి’ అని నోటీసులో పేర్కొన్నారు. ఈ నోటీసు అందిన 10 రోజుల్లో ఆలయాన్ని ఖాళీ చేసి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ విభాగానికి అప్పగించాలని, లేదంటే మీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆంజనేయస్వామిని హెచ్చరించారు. కాగా, ఈ గుడిని 1931 లో నిర్మించినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.