Gotam Lal Meena : కరోనాతో రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

కరోనా రెండో దశ విజృంభ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్న విషయం తెలిసిందే.

Gotam Lal Meena : కరోనాతో రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

Gotam Lal Meena

Gotam Lal Meena కరోనా రెండో దశ విజృంభ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రోజూ వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్న విషయం తెలిసిందే. సామాన్య జనంతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. రాజస్థాన్‌లో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనాతో మృతి చెందగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కన్నుమూశారు.

రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా ధరియావాడ్ యోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే గౌతమ్ లాల్ మీనా(56) బుధవారం కరోనాతో కన్నుమూశారు. ఈనెల 16న కరోనా బారినపడి ఆయనను ఉదయ్‌పూర్‌ లోని మహారాణా భూపాల్ ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. ఆరోగ్యం క్షీణించడంతో వెంటిలేటర్‌ పై ఉంచి చికిత్స అందించారు. బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. గౌతమ్ లాల్ మీనాకి.. భార్య, నలుగురు కుమారులు ఉన్నారు.

గౌతమ్ లాలా మీనా మృతి పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. మీనా ఆత్మకు శాంతి చేకూరాలని ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. రాజస్తాన్ అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌ పూనియా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, గులాబ్‌ చంద్‌ కటారియా గౌతమ్ లాలా మీనా మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ఇంతకు ముందు రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కైలాష్‌ త్రివేది, గజేంద్ర శక్తివత్‌, బీజేపీ ఎమ్మెల్యే కిరణ్‌ మహేశ్వరి కరోనా సోకి మృతి చెందారు.