Ashok Gehlot : హాస్పిటల్ లో రాజస్తాన్ సీఎం..త్వరగా కోలుకోవాలని మోడీ ట్వీట్

రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు.

Ashok Gehlot : హాస్పిటల్ లో రాజస్తాన్ సీఎం..త్వరగా కోలుకోవాలని మోడీ ట్వీట్

Pm Gehlot

Ashok Gehlot రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. గెహ్లాట్ ఆరోగ్యం బాగుండాలని,త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు శుక్రవారం ఓ ట్వీట్ లో ప్రధాని మోదీ పేర్కొన్నారు.

కాగా, తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో  రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ జైపూర్ లోని ఎస్ఎమ్ఎస్ హాస్పిటల్ లో చేరారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా శుక్రవారం ఓ ట్వీట్ లో తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత పలు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. నిన్నటి నుంచి తీవ్రమైన ఛాతీ నొప్పి వస్తుంది. ఎస్ఎమ్ఎస్ హాస్పిటల్ లో సీటీ ఎన్జీఓ పరీక్షలు చేశారు. యాంజియోప్లాస్టీ త్వరలోనే వైద్యులు చేస్తారు. నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. త్వరలోనే తిరిగి వస్తాను. మీ ప్రార్థనలు, ఆశీర్వాదాలు నాతోనే ఉన్నాయి అని శుక్రవారం చేసిన ట్వీట్ లో గెహ్లాట్ పేర్కొన్నారు.

కాగా,​ ఏప్రిల్​ 29న సీఎం గెహ్లాట్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి రోగ లక్షణాలు లేకపోవడంతో హోమ్​ ఐసోలేషన్​కు వెళ్లారు. డాక్టర్ల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తన ఆరోగ్యం సరిగా లేదని పలు వర్చువల్ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు గెహ్లాట్ చెప్పారు. అందుకే ఆయన ఎలాంటి బహిరంగ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. గత రాత్రి ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా అనారోగ్యం కారణంగా రద్దు చేసుకున్నారు.