VAT on Petrol,Diesel : పెట్రోల్,డీజిల్‌పై వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలు

పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును తగ్గించటంతో ఇప్పుడు రాష్ట్రాలు కూడా తమ వంతుగా వ్యాట్ ను తగ్గిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజస్ధాన్ కేరళ రాష్ట్రాలు స్పందించాయి.

VAT on  Petrol,Diesel  : పెట్రోల్,డీజిల్‌పై వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలు

VAT on Petrol Diesel

VAT on Petrol,Diesel :  పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ పన్నును తగ్గించటంతో ఇప్పుడు రాష్ట్రాలు కూడా తమ వంతుగా వ్యాట్ ను తగ్గిస్తున్నాయి. ఇందులో భాగంగా రాజస్ధాన్ కేరళ రాష్ట్రాలు స్పందించాయి. రాజస్ధాన్ ప్రభుత్వం పెట్రోల్ పై రూ.2-48 పైసలు డీజిల్ పై రూ. 1-16 పైసలు వ్యాట్ ను తగ్గించింది.  కేరళ ప్రభుత్వం పెట్రోల్ పై రూ.2-41 పైసలు, డీజిల్ పై రూ. 1-36 పైసలు వ్యాట్ ను తగ్గించింది. కాగా కేంద్రం తీసుకున్న  నిర్ణయాన్ని కేరళ స్వాగతించింది.

మరోవైపు ఇది అంతా అంకెల గారడీ అని ప్రతి పక్ష కాంగ్రెస్ నాయకులు కేంద్రాన్ని విమర్శించారు.  కేంద్రం పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించటం వల్ల ప్రజలకు ఏమీ ఉపశమనం లభించలేదని…పెట్రోల్​పై 60 రోజుల్లో రూ.10 ధర పెంచి… ఇప్పుడు రూ.9.50 తగ్గించారని కాంగ్రెస్ పార్టీ మండి పడింది.  దమ్ముంటే పెట్రోల్ డీజిల్ పై విధించిన సుంకాన్ని యూపీఏ ప్రభుత్వం ఉన్న 2014 మే స్ధాయికి తీసుకురావాలని డిమాండ్ చేసింది.

2014లో పెట్రోల్ పై ఎక్సైజ్ డ్యూటీ రూ.9-48 మాత్రమే ఉందని అది ఇప్పుడు రూ. 19-90గా ఉందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా అన్నారు. పెట్రోల్​పై కేంద్రం సెస్సులు విధించి రాష్ట్రాలకు నిధులు అందకుండా చేస్తోందని..ఇప్పుడు పెట్రోల్​పై పన్నులు తగ్గించాలని రాష్ట్రాలను కోరడం.. పూర్తిగా అర్థం లేని వాదన అని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు.

Also Read : Iron Steel Cement Prices : కేంద్రం మరో గుడ్‌న్యూస్.. తగ్గనున్న స్టీల్, సిమెంట్ ధరలు