భార్యను కత్తెరతో చంపేసి పక్కనే కూర్చొని వీడియో గేమ్ ఆడుకుంటూ..

భార్యను కత్తెరతో చంపేసి పక్కనే కూర్చొని వీడియో గేమ్ ఆడుకుంటూ..

Rajasthan: జోద్‌పూర్‌లోని ఓ వ్యక్తి భార్యను పొడిచి చంపి పక్కనే కూర్చొని వీడియో గేమ్ ఆడుకున్నాడు. సోమవారం జరిగిన ఘటనపై పోలీసులు ఇలా చెబుతున్నారు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య జరిగిన వాదన పెరిగి విక్రమ్ సింగ్(35)తన భార్య శివ్ కన్వార్(30)ను పొడిచి చంపాడు.

స్పాట్ కు పోలీసులు చేరుకునే సరికి రక్తపు మడుగులో ఉన్న శవం పక్కనే కూర్చొని వీడియో గేమ్ ఆడుకుంటున్నాడు. ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లేసరికి చనిపోయినట్లు ధ్రువీకరించారు. నిందితుడు ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటుండటంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని స్థానికులు చెబుతున్నారు.



‘నిందితుడు ఏ పనిచేయకుండా ఇంట్లోనే ఉంటే బాధితురాలి టైలరింగ్ పనిచేసి పోషించేదని చెబుతున్నారు. ఘటన జరిగిన రోజు అక్కడే ఉన్న కత్తెరలు తీసుకుని భార్యను వరుసగా కత్తితో పొడిచినట్లు తెలుస్తుంది.

నిందితుడు వీడియో గేమ్ ఆడుకుంటుండగా.. ఆమెను హాస్పిటల్ కు తీసుకెళ్లాం. అతని మొహంలో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు. వారిద్దరికీ ఇద్దరు పిల్లలు ఉండగా ఘటన జరిగిన సమయంలో ఇంట్లో లేరు.