Tie Wife With Chains : అమానుషం.. ఆ అనుమానంతో 30కేజీల బరువైన గొలుసులతో బంధించి భార్యకు చిత్రహింసలు

అనుమానం పెనుభూతం అంటారు. ఒక్కసారి అనుమానం మొదలైందో ఇక అంతే. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తాజాగా ఓ భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. మానవత్వం మరిచి ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. 30కిలోల బరువైన గొలుసులతో

Tie Wife With Chains : అమానుషం.. ఆ అనుమానంతో 30కేజీల బరువైన గొలుసులతో బంధించి భార్యకు చిత్రహింసలు

Tie Wife With Chains

Tie Wife With Chains : అనుమానం పెనుభూతం అంటారు. ఒక్కసారి అనుమానం మొదలైందో ఇక అంతే. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. తాజాగా ఓ భర్త భార్యపై అనుమానం పెంచుకున్నాడు. మానవత్వం మరిచి ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. 30కిలోల బరువైన గొలుసులతో ఆమెను బంధించాడు. మూడు నెలలు చిత్రహింసలు పెట్టాడు. ఈ అమానుష ఘటన రాజస్తాన్ లోని ప్రతాప్ గర్ జిల్లాలో చోటు చేసుకుంది.

ప్రతాప్ ఘర్ జిల్లా లాల్ గర్ గ్రామ్ పంచాయతీకి చెందిన ఓ మహిళ(40) తరుచూ పుట్టింటికి వెళ్లేది. పొలం పనుల్లో తల్లికి సాయం చేసేందుకు ఆమె వెళ్లేది. అయితే తరుచుగా పుట్టింటికి వెళ్లడంపై ఆమె భర్తకి అనుమానం వచ్చింది. పుట్టింటి దగ్గర ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని భర్త అనుమానించాడు. ఇదే విషయమై వారిద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ సారి భర్త అనుమాషంగా ప్రవర్తించాడు. భార్యను ఇనుప గొలుసులతో బంధించాడు. అలా మూడు నెలలు ఆమెకు నరకం చూపించాడు. చివరికి ఇరుగుపొరుగు వారి ద్వారా విషయం పోలీసులకు చేరింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను విడిపించారు. శాడిస్టు భర్తను అరెస్ట్ చేశారు.

”పొలం పనుల్లో నా తల్లికి సాయం చేసేందుకు వెళ్లేదాన్ని. తాగుడికి బానిసైన నా భర్త అక్కడికి వచ్చి నా తల్లి ముందే నన్ను కొట్టేవాడు. నా తల్లికి వయసు మీద పడింది. అందుకే ఆమెకు సాయం చేయాలని వెళ్తున్నా. అయితే నా భర్త తాగొచ్చి నన్ను కొట్టేవాడు. నేను అతడిని మోసం చేస్తున్నానేమో అని అనుమానించే వాడు” అని బాధితురాలు వాపోయింది. హోలీకి కొన్ని రోజుల ముందు నా భర్త, నా కొడుకు, నా భర్త కుటుంబసభ్యులు నన్ను ఇనుము గొలుసులతో కట్టేశారని కన్నీటిపర్యంతమైంది. అలా మూడు నెలలు పాటు నన్ను బంధించి శారీరకంగా, మానసకింగా చిత్ర హింసలు పెట్టారని వాపోయింది. తనను ఇంతగా బాధపెట్టిన వారందరిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు పోలీసులను వేడుకుంది.