Omicron : రాజస్తాన్ లో ఒమిక్రాన్ కలకలం..దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన కుటుంబం మొత్తానికి కరోనా

: జైపూర్​లోని దాదీ కా ఫాటక్​ ప్రాంతంలో నివసించే ఓ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు సహా నలుగురు వ్యక్తులకు తాజాగా కొవిడ్ సోకినట్లు నిర్థారణ అయింది. వీరందరూ ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి

Omicron : జైపూర్​లోని దాదీ కా ఫాటక్​ ప్రాంతంలో నివసించే ఓ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు సహా నలుగురు వ్యక్తులకు తాజాగా కొవిడ్ సోకినట్లు నిర్థారణ అయింది. వీరందరూ ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి భారత్​కు తిరిగివచ్చారు. అయితే వారికి ఒమిక్రాన్ వేరియంటే ​సోకిందేమోనని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారి వద్ద నుంచి సేకరించిన శాంపిలస్ ను జన్యు పరీక్షల కోసం పంపారు. ప్రస్తుతం ఆ కుటుంబం ఐసొలేషన్​లో ఉందని, వారితో సన్నిహితంగా ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా, బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదు అయినట్లు గురువారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా,అందులోని ఓ బాధితుడు కోవిడ్ టెస్ట్ ఫలితం వచ్చే ముందే దుబాయ్ వెళ్లిపోయాడు. ఇక,రెండో బాధితుడు బెంగళూరులోనే ఓ డాక్టర్. అయితే అతనికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకున్నా కూడా ఒమిక్రాన్ సోకినట్లు తేలింది.

మరోవైపు,ఒమిక్రాన్ కలకలం నేపథ్యంలో కోవిడ్‌ నిర్ధరణ పరీక్షలను ముమ్మరం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఆర్‌టీ-పీసీఆర్‌, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష (ఆర్‌ఏటీ)లకు చిక్కకుండా ఈ వేరియంట్‌ తప్పించుకోలేదని పేర్కొంది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వివిధ విమానాశ్రయాలు, ఓడరేవులు, భూ సరిహద్దుల ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్నవారిపై సమర్థ నిఘా ఏర్పాటుచేయాలని ఆదేశించింది.

ALSO READ Omicron : డెల్టాతో పోలిస్తే..రీ ఇన్ఫెక్షన్స్ మూడు రెట్లు ఎక్కువ!

ALSO READ Omicron : అమెరికాలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు..న్యూయార్క్ లో కొత్తగా ఐదు

ట్రెండింగ్ వార్తలు