ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు అబ్బాయిలు..అసలు విషయం తెలిసి..

ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమించారు. వారిద్దరూ బంధువులే కజిన్స్ అవుతారు. ఒకరికి తెలియకుండా మరొకరు ఓ అమ్మాయిని ప్రేమించారు. పెళ్లికూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇంతలో ఇద్దరూ ప్రేమించింది ఒకే అమ్మాయిని అని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆతరువాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు అబ్బాయిలు..అసలు విషయం తెలిసి..

Two Cousins In Love With The Same Girl  : ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమించారు. వారిద్దరూ బంధువులే కజిన్స్ అవుతారు. ఒకరికి తెలియకుండా మరొకరు ఓ అమ్మాయిని ప్రేమించారు. పెళ్లికూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇంతలో ఇద్దరూ ప్రేమించింది ఒకే అమ్మాయిని అని తెలుసుకుని తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆతరువాత ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల లోకి వెళ్తే రాజస్తాన్‌ రాష్ట్రంలోని బుంది జిల్లా కేశవ్‌పురా గ్రామానికి చెందిన దేవరాజ్ గుర్జార్, మహేంద్ర గుర్జార్ వీరిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిని ఇష్టపడి ప్రేమించారు. రైలు కింద దూకి బలన్మరణానికి పాల్పడ్డారు. అచ్చు సినిమా స్టోరీలో ఉన్న ఈ కథకాని కథ రాజస్ధాన్ లో సోమవారం (మార్చి 8,2021) చోటుచేసుకుంది.

బుండి జిల్లాలోని కేశవ్‌పురా గ్రామానికి చెందిన 23 ఏళ్ల మహేంద్ర గుర్జర్, దేవరాజ్ గుర్జర్ లు బంధువులు. కజిన్స్ అవుతారు. ఓ రోజున వారిద్దరూ ఓ చోట కూర్చుని నేను ఓ అమ్మాయిని ప్రేమించానురా.. అంటే మరొకతను కూడా నేను కూడా ఓ అమ్మాయిని ప్రేమించాన్నా..అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఇద్దరూ సంతోషపడ్డారు. ఆ తరువాత నువ్వు ప్రేమించిన అమ్మాయిది ఏ ఊరు? ఎక్కడ ఉంటుంది? అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. అలా ఇరువురు తాము ప్రేమించిన అమ్మాయి వివరాలు చెప్పుకున్నారు. ఆ తరువాత షాక్ కు గురయ్యారు. దానికి కారణం..వారిద్దరూ ప్రేమించింది ఒకే అమ్మాయి కావటం. దీంతో ఎంత సంతోషంగా ఒకరు ప్రేమించిన అమ్మాయి వివరాలు తెలుసుకోవాలని అనుకున్నారో..పూర్తి వివరాలు తెలిసాక అంతే బాదపడ్డారు. ఇద్దరు కూడా ఒకే అమ్మాయిని ఇష్టపడ్డారు అని తెలిశాక వారిద్దరికీ ఏం చేయాలో అర్థం కాలేదు.

ఆ తరువాత..ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చారు. సరేలేరా..జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ప్రేమించిన అమ్మాయితో నువ్వు హ్యాపీగా ఉండు అంటే కాదు కాదు నువ్వే ఆ అమ్మాయితో సంతోషంగా ఉండు..అంటూ చెప్పుకున్నారు. కానీ వారిలో ఎవ్వరూ ఒప్పుకోలేదు. దీంతో చివరికి మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దగ్గరలో ఉండే ఓ రైల్వేస్టేషన్ సమీపంలో ఇరువురు ప్రాణాలు విడిచారు. ఇక ఆత్మహత్యకు పాల్పడే ముందు ఇద్దరు మాట్లాడుతూ..మా మరణానికి ఎవరు బాధ్యత కాదని..ఎవరికీ వారే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

అలాగే..ఇరువురి కుటుంబ సభ్యులకు సూచనలు ఇస్తూ.. ఒకరిపై ఇంకొకరు గొడవ పడకుండా, ఎప్పటిలాగే వారి బంధాన్ని కోనసాగించాలని తెలియజేశారు. అలాగే ఆ అమ్మాయి కుటుంబానికి కూడా కొన్ని సూచనలు ఇస్తూ ఆ అమ్మాయికి తగిన వ్యక్తిని ఇచ్చి వివాహం చేయాలని కోరారు. రైల్వే పట్టాలపై విగతజీవులుగా పడి ఉన్న ఇద్దరి ప్రేమికుల చేతులపై ఆ అమ్మాయి పేరును పచ్చబొట్లుగా వేసుకున్నారు. వారిద్దరి చేతిలో చెక్కిన ఆశా అనే అమ్మాయి పేరు ఉంది. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నారని వారి మొబైల్ ఫోన్లలోని చిత్రాలు మరియు వివరాలు సూచిస్తున్నాయి. అలాగే వారి చేతుల మీద ‘ఆశా’ అనే పేరు పచ్చబొట్టు వేయించుకున్నారు.

ఈ రెండు ఆత్మహత్యల గురించి పోలీసు అధికారి లఖన్‌లాల్ మీనా మాట్లాడుతూ..చనిపోయిన ఇద్దరు అబ్బాయిలు ఒకే అమ్మాయిని ప్రేమించారనే విషయం తెలిసి మనస్తాపానికి గురైన చనిపోయారని తెలిసిందనీ..ఇద్దరికీ చేతులపై ఆశా అనే పేరు పచ్చబొట్టుగా ఉందని అలాగే వారిద్దరు మొబైల్ ఫోన్లలోని ఫోటోలు..వివరాలు ఇద్దరూ ఒకే అమ్మాయివేనని అందుకే ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నామని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.