Ban On Drone : డ్రోన్ల వినయోగంపై కశ్మీర్ జిల్లాలో నిషేధం
కొద్ది రోజులుగా జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
Rajouri District Ban On Drone :కొద్ది రోజులుగా జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. గత మూడు రోజుల నుంచి జమ్మూకశ్మీర్ లో పలు మార్లు డ్రోన్ల దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో రాజౌరి జిల్లా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్లు మరియు ఇతర చిన్న ఎగిరే వస్తువల అమ్మకాలు, నిల్వ,రవాణా,వినియోగం పై నిషేధం విధిస్తున్నట్లు బుధవారం రాజౌరి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రుట్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే డ్రోన్ కెమెరాలు, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నవాళ్లు వాటిని పోలీసుల వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించారు. సర్వేలు, మ్యాపింగ్, నిఘా కోసం ప్రభుత్వం వాడే డ్రోన్లపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ఎగిరే వస్తువల వల్ల జాతి వ్యతిరేకులు దాడికి పాల్పడే అవకాశం ఉందని, దాని వల్ల మనుషుల ప్రాణాలకు రిస్క్ ఏర్పాడుతున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
కొన్నేళ్లుగా సమాజంలో చిన్న డ్రోన్ కెమెరాల యొక్క గృహ వినియోగం కూడా పెరిగిందని గమనించబడింది. సామాజిక మరియు సాంస్కృతిక సమావేశాలలో ఫోటోలు మరియు వీడియోలను తీయడానికి చిన్న డ్రోన్ కెమెరాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా యువత.. డ్రోన్ లాంటి బొమ్మలు మరియు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను వాడేందుకు ఆశక్తి కనబరుస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో ఎటువంటి గందరగోళాన్ని నివారించడానికి మరియు ముఖ్యమైన సంస్థలు మరియు అధిక జనాభా ఉన్న ప్రాంతాల సమీపంలో వైమానిక స్థలాన్ని భద్రపరచడానికి,జీవితానికి గాయం కలిగించే ప్రమాదాన్ని తొలగించడానికి అన్ని సామాజిక మరియు సాంస్కృతిక సమావేశాలలో ఏదైనా డ్రోన్ లేదా చిన్న ఎగిరే బొమ్మలు వంటి వస్తువులను ఉపయోగించడాన్ని నిలిపివేయడం ఒక హేతుబద్ధమైనది మరియు ఉపయోగకరమైనది అని రాజౌరి జిల్లా మేజిస్ట్రేట్ రాజేష్ కుమార్ షవన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు