Rakhi Sawant : పీపీఈ కిట్‌లో కూర‌గాయ‌లు కొనేందుకు వెళ్లిన నటి, తిట్టిపోస్తున్న నెటిజన్లు

రాఖీ సావంత్.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. వివాదాలకు కేరాఫ్ ఈ అమ్మడు. తాజాగా రాఖీ సావంత్ మరోసారి న్యూస్ లోకి ఎక్కింది. ఆమె చేసిన పని చర్చకు దారితీసింది. తాను ఏదో చేయాలనుకుని మరేదో చేసేసి విమర్శల పాలైంది రాఖీ సావంత్.

Rakhi Sawant : పీపీఈ కిట్‌లో కూర‌గాయ‌లు కొనేందుకు వెళ్లిన నటి, తిట్టిపోస్తున్న నెటిజన్లు

Rakhi Sawant

Rakhi Sawant : రాఖీ సావంత్.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. వివాదాలకు కేరాఫ్ ఈ అమ్మడు. తాజాగా రాఖీ సావంత్ మరోసారి న్యూస్ లోకి ఎక్కింది. ఆమె చేసిన పని చర్చకు దారితీసింది. తాను ఏదో చేయాలనుకుని మరేదో చేసేసి విమర్శల పాలైంది రాఖీ సావంత్.

rakhi sawant

బాలీవుడ్ న‌టి, బిగ్‌బాస్ 14 కంటెస్టెంట్ రాఖీ సావంత్ పీపీఈ కిట్‌లో కూర‌గాయ‌లు కొన‌డానికి ముంబైలోని లోకానంద్ వాలా మార్కెట్ కు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అసలే కరోనా విజృంభిస్తోంది. పైగా సెలబ్రిటీ. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాఖీ సావంత్‌ వినూత్న ఆలోచన చేసింది. జనాలు తనను గుర్తు పట్టకుండా ఉండటం కోసమే కాక.. కరోనా నుంచి కాపాడుకోవడం కోసం పీపీఈ కిట్‌ ధరించి మార్కెట్‌ కు వెళ్లింది.

క‌రోనా టైమ్‌లో ఆమె ఇలా పీపీఈ కిట్‌లో పూర్తి జాగ్ర‌త్త‌లు తీసుకుని మార్కెట్ కి వెళ్ల‌డం బాగానే ఉంది. కానీ.. రెండు పెద్ద పొరపాట్లే చేసింది. ప్రతిఫలంగా తీవ్ర విమర్శల పాలైంది. నెటిజన్ల ఆమెని బూతుడు తిడుతున్నారు. అసలేం జరిగిందంటే…

rakhi sawant

మార్కెట్ లో ఓ వ్యాపారి దగ్గర రాఖీ కూర‌గాయ‌లు కొంది. కూరగాయలు అమ్మే వ్య‌క్తితో ఆమె విపరీతంగా బేరమాడటం ఈ వీడియోలో చూడొచ్చు. అంతేకాదు.. త‌ర‌చూ మాట్లాడే స‌మ‌యంలో రాఖీ త‌న మాస్క్ తీస్తూ క‌నిపించింది. అలా మాస్కు తీయడం ఒక తప్పు అయితే.. మాలాంటి పేద‌వాళ్ల నుంచి మీరు లాక్‌డౌన్‌లో టైమ్‌లో చాలా డ‌బ్బు తీసుకుంటారు. ఈసారి అలా చేయ‌కూడదు అంటూ కూరగాయల వ్యాపారికి వార్నింగ్ ఇచ్చింది. ఇది మరో తప్పు. పదే పదే మాస్క్ తియ్యడం, బేరాలు ఆడటం, కూరగాయల వ్యాపారులు దోచుకుంటున్నారని అనడం… దీంతో రాఖీ తీరుపై నెటిజన్లు సీరియస్ అయ్యారు.

rakhi

కూర‌గాయ‌ల వ్య‌క్తితో రాఖీ బేర‌మాడ‌టమే కాకుండా తనను పేదవాడితో పోల్చుకోవడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. చాలామంది నెటిజ‌న్లు రాఖీ తీరుపై ఫైర్ అవుతున్నారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో మీ లాంటి డబ్బున్న వాళ్లకంటే ఆ పేదలకే డ‌బ్బు ఎక్కువ అవ‌స‌రం అని కామెంట్ చేస్తున్నారు. ఇది టూ మచ్ అని సీరియస్ అవుతున్నారు. ఇక, నువ్వు ప‌దేప‌దే మాస్క్ తీసి మాట్లాడుతుంటే పీపీఈ కిట్ వేసుకున్నా వేస్టే, కరోనా రావడం ఖాయం అని మ‌రికొందరు కామెంట్ చేశారు. ఇలా.. ఏదో చేయాలని అనుకుని మరేదో చేసి అడ్డంగా బుక్కైయింది ఈ కాంట్రవర్సరీ నటి.

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)