హ్యాకర్ల ఎఫెక్ట్: విద్యుత్ పంపిణీ సంస్థలకు గండం తప్పింది

  • Published By: vamsi ,Published On : May 3, 2019 / 03:19 AM IST
హ్యాకర్ల ఎఫెక్ట్: విద్యుత్ పంపిణీ సంస్థలకు గండం తప్పింది

తెలుగు రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థల వెబ్ సైట్లను హ్యాక్ చేశారు హ్యాకర్లు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(TSPDCL), ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ( TSNPDCL), దక్షిణ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ(APSPDCL), తూర్పు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ(APEPDCL) లకు చెందిన అధికారిక వెబ్ సైట్లను హ్యాక్ చేసిన హ్యాకర్లు ర్యాన్ సమ్ వేర్ వైరస్ ద్వారా సర్వర్లలో ఉన్న డేటాను దొంగలించి పూర్తిగా సైట్ల నుండి తొలగించారు. ఈ డేటాను తిరిగి వెనక్కి ఇవ్వాలంటే రూ.35 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేశారు హ్యాకర్లు.

వెంటనే రంగంలోకి దిగిన నిపుణులు అంతర్జాతీయ హ్యాకర్లు డేటాను హ్యాక్ చేసినట్లు  గుర్తించారు. ర్యాన్ సమ్ వేర్ వైరస్ ద్వారా సర్వర్లలో ఉన్న డేటాను దొంగలించారని గుర్తించారు. రూ.35కోట్ల కోసమే వారు ఈ పని చేసినట్లు చెబుతున్నారు. అయితే పోయిన డేటా మొత్తం బ్యాకప్‌ ఉండడంతో పెద్ద ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు. హ్యాక్ అయిన వెబ్ సైట్లను ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ టీసీఎస్ నిర్వహిస్తుంది. డిస్కంల హ్యాకింగ్‌పై సీసీఎస్‌ పోలీసులకు TSPDCL ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్టు కింద సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.