అర్జీడీ అధికారంలోకి వస్తే…10లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం
త్వరలో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అర్జీడీ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ప్రకటించారు. రాష్ట్రం నిరుద్యోగం సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని…సెప్టెంబర్ 5 న తమ పార్టీ ప్రారంభించిన నిరుద్యోగ పోర్టల్స్షలో రాష్ట్రం నుండి 22 లక్షల మంది నమోదు చేసుకున్నట్లు తేజస్వీ యాదవ్ తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఆర్జేడీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇస్తే మొదటి క్యాబినెట్ సమావేశంలో మొదటి సంతకంతోనే 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వబడతాయన్నారు. ఇది కేవలం వాగ్దానం మాత్రమే కాదని తమ బలమైన సంకల్పం అని తెలిపారు. ఇవి తాత్కిలిక, ప్రైవేటు ఉద్యోగాలు కావని.. ప్రభుత్వ ఉద్యోగాలు అదేవిధంగా శాశ్వతమైనవన్నారు.
డబ్ల్యూహెచ్వో ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు ఉండాలని, బీహార్ లో ఆరోగ్య శాఖకు 2.5 లక్షల మంది సిబ్బంది అవసరం. ఉందన్నారు. బీహార్లో పోలీసుశాఖలో ఖాళీగా ఉన్న స్థానాల గురించి, ఇంకా సృష్టించాల్సిన వాటి గురించి కూడా ఆయన మాట్లాడారు.
ప్రస్తుతం లక్ష జనాభాకు కేవలం 77 మంది పోలీసులు ఉన్నారు. చిన్న రాష్ట్రమైన మణిపూర్లో లక్ష జనాభాకు వెయ్యి మంది పోలీసులు ఉన్నట్లు తేజస్వి చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని ఉద్దేశిస్తూ.. గత 15 ఏళ్లుగా పరిపాలిస్తున్న వారి అబద్దాలను ప్రజలు ఇప్పటికే చూశారని తేజస్వీ యాదవ్ అన్నారు.
కాగా, 243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి 3విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 28న తొలి దశ పొలింగ్ జరగనుంది. నవంబర్-10న బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.