Raymond ఆస్తులు అమ్మకం: 700రూపాయల కోట్ల విలువైన స్థలం

Raymond ఆస్తులు అమ్మకం: 700రూపాయల కోట్ల విలువైన స్థలం

ప్రఖ్యాత టెక్స్‌టైల్ ఇండస్ట్రీ రేమండ్స్ లిమిటెడ్ ఆస్తులు అమ్మకానికి పెట్టింది. ముంబైలోని థానెలో ఉన్న రూ.700కోట్ల విలువైన 20ఎకరాల స్థలాన్ని అమ్మేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ గ్జాండర్ కొనేందుకు ముందుకు వచ్చింది. రేమండ్స్ సంస్థ మొదలుపెట్టనున్న మరో ప్రొడక్ట్ విలువ రూ.1700కోట్లు కాగా, ఈ అమ్మకంతో వచ్చిన డబ్బు పెట్టుబడిలో సాయపడుతుందని రేమండ్స్ వ్యూహం.
 
థానెలోని 20ఎకరాల స్థలాన్ని కొనుక్కుని.. దాని క్రేజ్‌ను సొమ్ము చేసుకోవాలని గ్జాండెర్ సంస్థ భావిస్తోంది. ఈ సందర్భంగా గ్జాండెర్ ఛైర్మన్ మాట్లాడుతూ.. ముంబై లాంటి మెట్రో పొలిటన్ మార్కెట్లో ఇటువంటి విలువైన స్థలాన్ని కొనుగోలు చేయడం అరుదుగా భావిస్తున్నాం. ఇలాంటి అవకాశం కోసం సహనంతో ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్నాం’ అని వివరించారు. 

ఈ స్థలంలో ఓ సారి తమ ప్రాజెక్టు మొదలైతే 20మిలియన్ కస్టమర్లు వచ్చిపోవడానికి వీలవుతుందని అంచనా. దీని ద్వారా 4వేల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని భావిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా రేమండ్స్ ఆ స్థలాన్ని టెక్స్‌టైల్ పరిశ్రమ కోసం వాడుతూ వచ్చింది. 

ఈ టెక్స్‌టైల్ మిల్ రేమండ్స్‌ ఉత్పత్తులలో ప్రధానంగా ఉండేది. తొమ్మిదేళ్ల క్రితం మొదలుపెట్టిన మిల్లు ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలో ఒప్పందం కుదరక మూతపడింది. ఆ తర్వాత రేమండ్స్‌కు ల్యాండ్ డెవలప్‌మెంట్ కోసం క్లియరెన్స్ పొందింది.