RBI: ఆర్బీఐను ధిక్కరించిన 4 బ్యాంకులకు జరిమానా
ఆర్బీఐ ఆదేశాలను ధిక్కరించి ఉల్లంఘనకు పాల్పడిన నాలుగు బ్యాంకులకు జరిమానా విధించింది. సెంట్రల్ బ్యాంక్, సిటీ యూనియన్
RBI: ఆర్బీఐ ఆదేశాలను ధిక్కరించి ఉల్లంఘనకు పాల్పడిన నాలుగు బ్యాంకులకు జరిమానా విధించింది.
సెంట్రల్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, తమిళనాడ్ మెర్కంటైల్ బ్యాంక్లతో పాటు మరో రెండు బ్యాంకులపై ఆర్బీఐ భారీ జరిమానా విధించింది.
ఎంఎస్ఎంఈ రుణాలు, ఎడ్యుకేషన్ రుణాలు, వ్యవసాయ రుణాల విషయంలో ఆర్బీఐ నిబంధనలను పాటించని కారణంగా సిటీ యూనియన్ బ్యాంక్ లిమిటెడ్కు రూ.1 కోటి పెనాల్టీ విధించింది.
మరో స్టేట్మెంట్ లో సైబర్ సెక్యూరిటీ విషయంలో నిబందనలు పాటించలేదని తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్ పై రూ.1 కోటి పెనాల్టీ.. మరో రెండు బ్యాంకులైన నూతన్ నాగరిక్ సహకారి బ్యాంక్ పై రూ.90లక్షలు, అపెక్స్ బ్యాంక్స్ పై రూ.10లక్షల జరిమానా విధించింది.
డిపాజిట్లపై వడ్డీ రేట్లు, కేవైసీ రూల్స్ను నూతన్ నాగరిక్ సహకారి బ్యాంక్ అతిక్రమించింది. ‘రిజర్వ్ బ్యాంక్ కమర్షియల్ పేపర్ డైరెక్షన్స్ 2017’, ‘నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్’లో కొన్ని నిబంధనలను పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరించింది అపెక్స్ బ్యాంక్.