మొదట నియంత్రించాల్సింది డిజిటల్​ మీడియానే…సుప్రీంలో కేంద్రం అఫిడవిట్​

  • Published By: venkaiahnaidu ,Published On : September 17, 2020 / 03:57 PM IST
మొదట నియంత్రించాల్సింది డిజిటల్​ మీడియానే…సుప్రీంలో కేంద్రం అఫిడవిట్​

మీడియా నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్​ దాఖలు చేసింది. మీడియాను నియంత్రించాలనుకుంటే… తొలుత డిజిటల్​ మీడియాతో ప్రారంభించాలని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.




సివిల్​ సర్వీసు ఉద్యోగాల్లోకి ఓ వర్గం వారినే అధికంగా తీసుకునేందుకు కుట్ర జరిగింది అని సుదర్శన్​ టీవీ ఛానల్… ‘UPSC జీహాద్’ టైటిల్ తో ​ ప్రోమోలు ప్రసారం చేయడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఈమేరకు కేంద్రం తన అభిప్రాయం చెప్పింది.



https://10tv.in/tatas-win-contract-to-build-new-parliament-building/
ఎలక్ట్రానిక్​, ప్రింట్​ మీడియా నియంత్రణకు ఇప్పటికే సరిపడా నిబంధనలు ఉన్నాయని సుప్రీం కోర్టులో బుధవారం దాఖలు చేసిన అఫిడవిట్ ​లో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ మీడియాను నియంత్రించాలనుకుంటే.. తొలుత డిజిటల్​ మీడియాపై చర్యలు చేపట్టాలని పేర్కొంది. వాట్సాప్​, ఫేస్​బుక్​, ట్విట్టర్​ వంటి సామాజిక మాధ్యమాల వల్ల సమాచారం క్షణాల్లో వైరల్​గా మారే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా వివరించింది.