మొదట నియంత్రించాల్సింది డిజిటల్ మీడియానే…సుప్రీంలో కేంద్రం అఫిడవిట్
మీడియా నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. మీడియాను నియంత్రించాలనుకుంటే… తొలుత డిజిటల్ మీడియాతో ప్రారంభించాలని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది.
సివిల్ సర్వీసు ఉద్యోగాల్లోకి ఓ వర్గం వారినే అధికంగా తీసుకునేందుకు కుట్ర జరిగింది అని సుదర్శన్ టీవీ ఛానల్… ‘UPSC జీహాద్’ టైటిల్ తో ప్రోమోలు ప్రసారం చేయడానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై ఈమేరకు కేంద్రం తన అభిప్రాయం చెప్పింది.
https://10tv.in/tatas-win-contract-to-build-new-parliament-building/
ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా నియంత్రణకు ఇప్పటికే సరిపడా నిబంధనలు ఉన్నాయని సుప్రీం కోర్టులో బుధవారం దాఖలు చేసిన అఫిడవిట్ లో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ మీడియాను నియంత్రించాలనుకుంటే.. తొలుత డిజిటల్ మీడియాపై చర్యలు చేపట్టాలని పేర్కొంది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల వల్ల సమాచారం క్షణాల్లో వైరల్గా మారే అవకాశం ఉండటమే ఇందుకు కారణంగా వివరించింది.