Reliance Jio : జియో బంపర్ ఆఫర్… రూ.199 కే 1000జీబీ డేటా
జియో ఫైబర్ తన యూజర్ల కోసం అద్బుతమైన ఆఫర్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 199కే 1టీబీ డేటా (1000జీబీ)ను జియోఫైబర్ అందిస్తోంది.
Reliance Jio : జియో ఫైబర్ తన యూజర్ల కోసం అద్బుతమైన ఆఫర్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 199కే 1టీబీ డేటా (1000జీబీ)ను జియోఫైబర్ అందిస్తోంది. యూజర్లకు ఈ డేటా సాచెట్ ట్యాక్స్తో కలిపి రూ.234.82 రానుంది. కాగా డేటా ప్యాక్ వ్యాలిడిటీ కేవలం ఏడు రోజులు మాత్రమే. 1 టీబీ డేటా 100ఎమ్బీపీఎస్ స్పీడ్తో యూజర్లకు అందుబాటులో ఉండనుంది. డేటా ప్యాక్ ముగిసిన తర్వాత 1ఎమ్బీపీఎస్ స్పీడ్ వస్తుంది. అయితే వారి ప్లాన్ ఆఫర్ చేసిన ఎఫ్ యూపీ డేటా పూర్తిగా వినియోగించిన తర్వాత ఈ ప్లాన్ ను కొనే అవకాశం ఉంటుంది.
వాస్తవానికి జియోఫైబర్ తన ప్రతి డేటా ప్లాన్ లో యూజర్ కు 3.3టీబీ డేటా ఇస్తోంది. అయితే యావరేజ్ ఇంటర్నెట్ అవసరాలు ఉన్న యూజర్లకు ఈ డేటా సాచెట్ ఉపయోగపడనుంది. ఏది ఏమైనా జియోఫైబర్ నుంచి నుంచి ఇది సాటిస్ ఫైయింగ్ ఆఫర్ అని చెప్పొచ్చు. ఎఫ్ యూపి డేటా అయిపోయాక మరికొన్ని రోజుల కోసం డేటా అవసరం ఉంటుంది. ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ ఇలాంటి ఆఫర్ ఇవ్వడం లేదు. వారి కస్టమర్లు మంత్లీ ఎఫ్ యుపి డేటా అయిపోతే, ఇలాంటి రీచార్జ్ చేసుకునే ఆఫర్ లేదు.
దేశంలో మోస్ట్ పాపులర్ బ్రాండ్ సర్వీస్ ప్రొవైడర్స్ లో ఒకటి జియో ఫైబర్. చాలా తక్కువ సమయంలోనే ఇతర ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ను బీట్ చేసింది. తన దైన ఆఫర్లతో వారికంటే ముందు నిలిచింది.
టెలికాం రంగంలో జియో అనేక సంచలనాలను సృష్టించింది. తక్కువ ధరకే ఇంటర్నెట్ డేటా, ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. జియో దెబ్బకు పలు మొబైల్ నెట్వర్క్ కంపెనీలు దిగొచ్చాయి. ఇంటర్నెట్ డేటా ధరలను తగ్గించాయి. ఉచిత కాల్స్ను కూడా ప్రవేశపెట్టాయి. 2019 సెప్టెంబర్లో జియో ఫైబర్ను ప్రకటించి రిలయన్స్ మరో సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవలను పలు నగరాల్లో ప్రవేశపెట్టింది. జియో ఫైబర్తో పలు ఓటీటీ సేవలను, ఉచిత హెచ్డీ వాయిస్ కాల్స్, హై స్పీడ్ ఇంటర్నేట్, టీవీ వీడియో కాలింగ్, గేమింగ్, సెక్యూరిటీ సేవలను యూజర్లకు అందిస్తోంది. జియోఫైబర్ బ్రాడ్బ్యాండ్లో 999, 1499, 2499 డేటా ప్యాక్ లు ఎక్కువగా ప్రజాదరణ పొందాయి.