దిగొచ్చిన ట్విట్టర్, ఖాతాల డిలీట్

దిగొచ్చిన ట్విట్టర్, ఖాతాల డిలీట్

Remove inflammatory content : ట్విట్టర్‌ దిగొచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గింది. సంస్థ అత్యున్నత అధికారులు అరెస్ట్ అయ్యే ముప్పు, జరిమానా పడే అవకాశం ఉండడంతో.. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిన ఖాతాలను డిలీట్ చేస్తోంది. ‘రైతుల హత్యాకాండకు మోదీ కుట్ర’ అన్న హాష్ ట్యాగ్‌తో కొద్ది కాలంగా కొందరు ట్వీట్టు చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెచ్చగొట్టేలా ఉన్న ఆ ట్వీట్లను తొలగించాలని.. ఆ ఖాతాలను డిలీట్ చేయాలని ట్విట్టర్‌ను ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

కేంద్ర హెచ్చరికలను ట్విట్టర్ ముందుగా ఒప్పుకోలేదు. ప్రభుత్వ ఆదేశాలను ట్విట్టర్ పాటించాల్సిందేనని, లేదంటే అరెస్ట్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు స్పందించింది. ఆ హాష్ ట్యాగ్‌తో 257 ఖాతాల నుంచి ట్వీట్లు వెళ్లినట్టు గుర్తించింది ట్విట్టర్. అందులో 126 ఖాతాలను బ్లాక్‌ లీస్ట్‌లో పెట్టింది. అదికాకుండా ఖలిస్థానీ, పాకిస్థాన్ గ్రూపులతో లింకులున్నట్టు కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న వెయ్యి 178 ఖాతాల్లో 583 ఖాతాలను ట్విట్టర్‌ తొలగించింది.