RIP CDS General Bipin Rawat : నిజమైన దేశభక్తుడు బిపిన్ రావత్..ప్రముఖుల సంతాపం
హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా 11 మంది సాయుధ బలగాల మృతదేహాలు గురువారం సాయంత్రంలోగా ఢిల్లీ చేరుకోనున్నట్లు

RIP CDS General Bipin Rawat : హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక సహా 11 మంది సాయుధ బలగాల మృతదేహాలు గురువారం సాయంత్రంలోగా ఢిల్లీ చేరుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, సైనికుల మరణాలపై సంతాపం ప్రకటించారు. అత్యంత శ్రద్ధతో వారంతా దేశ సేవ చేశారని కొనియాడారు. జనరల్ బిపిన్ రావత్.. సీడీఎస్గా దేశానికి విశేష సేవలందించారని మోడీ అన్నారు.
మోదీ ఓ ట్వీట్ లో..”జనరల్ బిపిన్ రావత్ అద్భుత సైనికుడు. నిజమైన దేశభక్తుడు. ఆయన మన సాయుధ బలగాలను, భద్రతా యంత్రాంగ ఆధునీకీకరణలో దోహదపడ్డారు. వ్యూహాత్మక విషయాలపై ఆయన ఆలోచనలు అసాధారణం. ఆయన మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. ఓం శాంతి”అని ట్వీట్ లో మోదీ పేర్కొన్నారు.
బిపిన్ రావత్ దంపతులు, మరో 11 మంది మరణంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిపిన్ మరణం.. దేశ సాయుధ దళాలకు తీరని లోటు అని ట్వీట్ చేశారు.
బిపిన్ రావత్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఇదో బాధాకరమైన రోజుగా అభివర్ణించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతున్న.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ త్వరగా కోలుకోవాలని షా ఆకాంక్షించారు.
జనరల్ బిపిన్ రావత్ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఈ కష్ట సమయంలో.. తమ ఆలోచనలన్నీ బాధిత కుటుంబాల వెంటే ఉన్నాయన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దేశం తన ధైర్యవంతులైన కుమారుల్లో ఒకరిని కోల్పోయింది అని సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతాపం తెలిపారు.
తమిళనాడులోని కూనూర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, ఇతర సాయుధ బలగాల మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓ ట్వీట్ లో తెలిపారు.
ALSO READ Army Chopper Crash : భారత తొలి త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి..20ఏళ్లకే ఆర్మీలో చేరి..
- GVL Challenge KTR : తెలంగాణ ప్రజలను ఏపీకి కాకుండా యూపీకి పంపే దమ్ముందా? కేటీఆర్కు జీవీఎల్ సవాల్
- AP Governor : ఢిల్లీలో ఏపీ గవర్నర్ బిజీబిజీ.. ముగిసిన ఐదు రోజుల పర్యటన..!
- Latha Mangeshkar : మోదీకి తొలి లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు
- Rajnath Singh: అవసరమైతే సరిహద్దులు దాటుతాం: రాజ్నాథ్ సింగ్
- Modi: విదేశీయుల కోసం త్వరలో ‘ఆయుష్ వీసా’: మోదీ
1Prashant Kishor: గుజరాత్, హిమాచల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయం: ప్రశాంత్ కిశోర్ సంచలన ట్వీట్
2చంపేశారా .. చనిపోయాడా ?
3Telangana Rains : హైదరాబాద్తో సహా పలు జిల్లాలకు వర్ష సూచన
4కొత్త మలుపులు తీసుకున్న దిశ కేసు
5Disha Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసు..సిర్పూర్కర్ కమిషన్ నివేదికలో కీలక అంశాలు..
6వైసీపీది ఐరన్ లెగ్ పాలన!
7Gyanvapi: జ్ఞానవాపి మసీదు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ
8NTR31: బ్లాక్ ఫాంటసీతో హోరెత్తిస్తున్న ప్రశాంత్ నీల్!
9హుజూరాబాద్ మున్సిపల్ పాలకవర్గంపై అవినీతి ఆరోపణలు
10Bengal Tigers: ఆడపులితో కలయిక కోసం బంగ్లాదేశ్ నుండి భారత్లోకి వస్తున్న పులులు
-
F3: ఎఫ్3 సెన్సార్ రిపోర్ట్.. సమ్మర్లో చిల్ కావడం ఖాయం!
-
Disa Encounter: దిశా ఎన్కౌంటర్లో సుప్రీం సంచలన తీర్పు: పోలీసులపై హత్యా నేరం నమోదు
-
Bangalore Airport : బెంగళూరు ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు కాల్
-
Sun Rare Images : సూర్యుడి అరుదైన చిత్రాలు..తొలిసారిగా కెమెరాకు చిక్కాయి
-
China : చైనా కొత్త ప్రాజెక్ట్..మరో భూమి కోసం అన్వేషణ
-
Taliban government : మహిళా జర్నలిస్టులపై తాలిబాన్ సర్కార్ ఆంక్షలు.. ముఖాలు కప్పుకొని న్యూస్ చదవాలని ఆదేశం
-
Supreme Court : దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై నేడు సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
YouTube: యూట్యూబ్ యూజర్ల టైం సేఫ్ చేసే ఫీచర్