Accident In Kashmir : లోయలో పడ్డ వాహనం..ఐదుగురు మృతి
జమ్మూకశ్మీర్లో మరోసారి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాంబన్ నుండి నీల్ గ్రామానికి వెళుతుండగా జమ్మూలోని రాంబన్ వద్ద వాహనం రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Road Accident In Kashmir: జమ్మూకశ్మీర్లో మరోసారి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాంబన్ నుండి నీల్ గ్రామానికి వెళుతుండగా జమ్మూలోని రాంబన్ వద్ద వాహనం లోయలో పడిపోయింది. రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలం వద్దకు చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడినవారిని వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు.
రెండు వాహనాలు కూడా వేగంగా ఢీకొనడం వల్లే ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవటంతో ఈ ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఓ ప్రైవేటు ప్యాసింజర్ వాహనం మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గత వారం రోజుల్లో ఇది రెండో ప్రమాదం కావటం గమనించాల్సిన విషయం.
ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ప్రమాద ఘటన మనస్సును చాలా బాధపెట్టిందని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు.
Pained by the loss of lives due to an accident in Ramban, Jammu and Kashmir. Condolences to those who lost their loved ones. I pray that the injured recover soon: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 2, 2021