Accident In Kashmir : లోయలో పడ్డ వాహనం..ఐదుగురు మృతి

జమ్మూకశ్మీర్‌లో మరోసారి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాంబన్ నుండి నీల్ గ్రామానికి వెళుతుండగా జమ్మూలోని రాంబన్‌ వద్ద వాహనం రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

Accident In Kashmir : లోయలో పడ్డ వాహనం..ఐదుగురు మృతి

Road Accident In Kashmir (1)

Road Accident In Kashmir: జమ్మూకశ్మీర్‌లో మరోసారి రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రాంబన్ నుండి నీల్ గ్రామానికి వెళుతుండగా జమ్మూలోని రాంబన్‌ వద్ద వాహనం లోయలో పడిపోయింది. రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలం వద్దకు చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. గాయపడినవారిని వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు.

రెండు వాహనాలు కూడా వేగంగా ఢీకొనడం వల్లే ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోవటంతో ఈ ప్రమాదం జరిగింది. నేషనల్‌ హైవేపై ఓ ప్రైవేటు ప్యాసింజర్‌ వాహనం మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గత వారం రోజుల్లో ఇది రెండో ప్రమాదం కావటం గమనించాల్సిన విషయం.

ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ప్రమాద ఘటన మనస్సును చాలా బాధపెట్టిందని మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు.