యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతి

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మృతి

road accident in UP : ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కారును ఆయుల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు విడిచారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.