Rohini Karte 2022 : రోహిణికార్తె వస్తోంది జాగ్రత్త.. భానుడు ఉగ్రరూపం చూపించే టైం..!
Rohini Karte 2022 : దేశ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పన్కర్లేదు.. ఎండలు మండిపోతున్నాయి.
Rohini Karte 2022 : దేశ వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అయితే చెప్పన్కర్లేదు.. ఎండలు మండిపోతున్నాయి. మే నెల చివరిలో రేపు (మే 25) నుంచి రోహిణి కార్తె ఎంట్రీ ఇస్తోంది. రోహిణి కార్తె ఎఫెక్టుతో ఎండలు మరింత ముదరనున్నాయి రోహిణి కార్తె కారణంగా సూర్యుడు సుర్రుమనిపించబపోతున్నాడు. వచ్చే నెల జూన్ 8 వరకు రోహిణి కార్తె ఉండనుంది. భానుడి ఉగ్రరూపం చూడాల్సి వస్తుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. ముఖ్యంగా వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటోంది. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగానే నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటలు దాటిందంటే చాలు.. సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు.
రానున్న వారం రోజుల్లో 45 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. విశాఖ నగరం, అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భానుడు భగభగమని మండిపోతున్నాడు. కోనసీమలోనూ ఎండల తీవ్రత అధిక స్థాయిలో ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాబ్, కరీంనగర్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. నెలాఖరు వరకు ఎండల తీవ్రత ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మే 28 వరకు వడగాల్పుల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. రోహిణికార్తెలో ఎండలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి మధ్యాహ్నం సమయంలో బయటికి రావొద్దని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Read Also : Summer In Telangana : తెలంగాణాలో పెరిగిన ఎండలు-అల్లాడుతున్న ప్రజలు