రూ. 100 కోట్లకు INS విరాట్ అమ్మకం

  • Published By: venkaiahnaidu ,Published On : October 1, 2020 / 10:26 PM IST
రూ. 100 కోట్లకు INS విరాట్ అమ్మకం

INS Viraat-Rs 100 cr, multiple clearances అత్యంత ఎక్కువ కాలం యుద్ధ రంగంలో సేవలందించిన INS​ విరాట్​ యుద్ధనౌక ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థ అధీనంలో ఉన్న విషయం తెలిసిందే. 1987 నుంచి 2017 వరకు భారత నావికా దళంలో సేవలందించిన విరాట్ ను.. ఈ ఏడాది జులైలో రూ.38.54 కోట్లకు వేలంలో శ్రీరామ్​ గ్రూప్​ కొనుగోలు చేసింది. ఈ నౌకను విచ్ఛిన్నం చేసేందుకు గుజరాత్​లోని అలంగ్​ తీర ప్రాంతానికి గతవారం తరలించారు.


అయితే,ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం యుద్ధ రంగంలో సేవలు అందించిన నౌకగా గుర్తింపు పొందిన ఐఎన్​ఎస్​ విరాట్​ను రూ.100 కోట్లకు అమ్మడానికి సిద్ధమైంది శ్రీరామ్​ గ్రూప్​. ముంబైకి చెందిన ఎన్విటెక్​ మెరైన్​ కన్సల్టెన్సీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ ఈ నౌకను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఈ యుద్ధనౌకను విచ్ఛిన్నం కాకుండా ఆపి, మ్యూజియమ్​లాగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.


దేశం మీద ప్రేమతో తాను ఈ యుద్ధనౌకను కొన్నానని శ్రీరామ్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ పటేల్ తెలిపారు. ప్రస్తుతం ముంబయికి చెందిన ఓ కంపెనీ.. ఈ నౌకను కొని, మ్యూజియమ్​లాగా మార్చాలని భావిస్తోందన్నారు. వాళ్లు దేశ భక్తితోనే ఈ పని చేస్తున్నందున.. తాను వారికి అమ్మేందుకు అంగీకరించానని ముఖేష్ పటేల్ తెలిపారు. అయితే.. వారు రక్షణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సి ఉంటుందని .. అది లేకుండా తాను వారికి అమ్మలేనని తెలిపారు. ఎన్​ఓసీ కోసం ఆ కంపెనీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని తెలిపారు. అయినప్పటికీ తాను ఎక్కువకాలం వేచిచూడనని . వారం వరకే గడువు ఇస్తానని . ఆ తర్వాత ఈ నౌకను విచ్ఛిన్నం చేస్తానని ముఖేష్ పటేల్ తెలిపారు.


కాగా, రక్షణ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్​ఓసీ) పొందేందుకు తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని… త్వరలోనే అది లభిస్తుందని ఎన్విటెక్​ మెరైన్​ కన్సల్టెన్సీస్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ మేనేజింగ్​ డైరెక్టర్​ వీకే శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. తాను వ్యక్తిగతంగా ముఖేష్​ను కలిశానని .. ధర విషయంలోనూ ఓ అంగీకారానికి వచ్చినట్లు చెప్పారు.