Vijay Mallya : మాల్యా, ఇతరుల నుంచి రూ. 18 వేల కోట్లు రిటర్న్

ఇండియన్ బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించి

Vijay Mallya : మాల్యా, ఇతరుల నుంచి రూ. 18 వేల కోట్లు రిటర్న్

vijay-malya

Rs 18,000 Crore Returned : ఇండియన్ బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు వెల్లడించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం, ఎస్సీ ముందు పెండింగ్ లో ఉణ్న PMLA కేసుల్లోని నేరాల్లో మొత్తం రూ. 67 వేల కోట్లు ఉన్నట్లు అంచనా. నేరాలను దర్యాప్తు చేయడం, స్వాధీనం చేసుకోవడం, అటాచ్ మెంట్ కోసం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు విస్తృత అధికారాలపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ లను సుప్రీంకోర్టు విచారిస్తున్న సంగతి తెలిసిందే.

Read More : Vijay Mallya: విజయ్ మాల్యా రోడ్డు మీదకు.. ఇంటి జప్తుకు స్విస్ బ్యాంక్ రెడీ

భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టి విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలు విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. నీరవ్ మోదీ, విజయ్ మాల్యా పరారైన ఆర్థిక నేరగాళ్ళు అని ముంబైలోని మనీలాండరింగ్ నిరోధక న్యాయస్థానం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరికి సంబంధించ ఆస్తులను గతంలో ఈడీ సీజ్ చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం(PMLA)కింద ఈ ముగ్గురికి సంబంధించి రూ. 18,170.02 కోట్లను ఈడీ గతంలో సీజ్ చేసింది. ఇందులో రూ. 969 కోట్ల విలువైన ఆస్తులు విదేశాల్లో ఉన్నాయి. బ్యాంకులకు వీరు చెల్లించాల్సిన బకాయిల్లో ఈ ఆస్తుల విలువ 80.45 శాతంగా ఉంది. ఆస్తుల బదిలీ వల్ల బ్యాంకులకు సగం మేర రుణాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది.

Read More : ఎండ్ ఆఫ్ గుడ్ టైమ్స్…ఈ రాత్రికే భారత్ కు విజయ్ మాల్యా!

మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి రూ.18,170.02 కోట్లు స్వాధీనం చేసుకోవడం మాత్రమే కాకుండా, దీనిలో సగ భాగం రూ.9,371.17 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు బుధవారం ఈడీ ట్విట్టర్ ద్వారా అప్పట్లో వెల్లడించింది. ముంబైలోని పీఎంఎల్ఏ స్పెషల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆస్తులను బదిలీ చేశారు. ఆస్తుల బదిలీ వల్ల బ్యాంకులకు సగం మేర రుణాలను రాబట్టుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ ముగ్గురినీ స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.