మోడీ,షా కోడ్ ఉల్లంఘన…ఈసీకి సుప్రీం డెడ్ లైన్

  • Published By: venkaiahnaidu ,Published On : May 2, 2019 / 10:38 AM IST
మోడీ,షా కోడ్ ఉల్లంఘన…ఈసీకి సుప్రీం డెడ్ లైన్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ చీఫ్ అమిత్‌ షా ఎలక్షన్ కోడ్‌ ఉల్లంఘనలపై ఈసీ చర్యలు తీసుకోవట్లేదంటూ కాంగ్రెస్‌ ఎంపీ సుస్మితాదేవ్‌ వేసిన పిటిషన్ పై గురువారం(మే-2,12019) సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది. మోడీ,షాలపై అందిన ఫిర్యాదులపై మే-6,2019లోపల నిర్ణయం తీసుకోవాలని ఈసీని సుప్రీం ఆదేశించింది. 

మోడీ,షాలపై కోడ్ ఉల్లంఘించారంటూ ఇప్పటివరకు 11 కంప్లెయింట్ లు వచ్చాయని,అందిన ఫిర్యాదుల్లో ఇప్పటికే రెండింటిపై మోడీ,షాలకు క్లీన్ చిట్ ఇచ్చామని,మరో 9 ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందందని, వీటిపై నిర్ణయం తీసుకునేందుకు వచ్చే బుధవారం వరకు సమయం కావాలని విచారణ సందర్భంగా ఈసీఐ సుప్రీంని కోరింది.అయితే మే-6లోపల నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.