World’s ‘First’ Beach : ప్రపంచంలో “మొట్టమొదటి బీచ్” భారత్ లోనే

కోట్ల సంవత్సరాల కిందట లావా చల్లబడి సముద్రాల్లో హెచ్చు తగ్గుల వల్ల భూమి ఏర్పడిందని ఇప్పటివరకు మనకు తెలుసు. కానీ అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఏర్పడిందనేది ప్రశ్నలకు తాజాగా సైంటిస్టులు

World’s ‘First’ Beach : ప్రపంచంలో “మొట్టమొదటి బీచ్” భారత్ లోనే

Beach

World’s ‘First’ Beach: కోట్ల సంవత్సరాల కిందట లావా చల్లబడి సముద్రాల్లో హెచ్చు తగ్గుల వల్ల భూమి ఏర్పడిందని ఇప్పటివరకు మనకు తెలుసు. కానీ అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఏర్పడిందనేది ప్రశ్నలకు తాజాగా సైంటిస్టులు సమాధానాలు చెప్పారు. ప్రపంచంలో మొట్టమొదటి సముద్రతీర భూమి ఏర్పడింది జార్ఖండ్‌ రాష్ట్రంలోని సింఘ్‌భూమ్‌ ప్రాంతంలోనేనని తాజాగా సైంటిస్టులు తేల్చేశారు. భారత్, ఆస్ట్రేలియా, అమెరికా శాస్త్రవేత్తలు చేసిన సంయుక్త పరిశోధనల్లో…సముద్ర మట్టానికి పైన 330 నుంచి 320 కోట్ల సంవత్సరాల మధ్యకాలంలో ఈ స్థిరమైన ఖండాంతర భూభాగాలు ఏర్పడినట్లు గుర్తించారు.

నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో ఇటీవల ప్రచురితమైన పేపర్‌లో ఈ ఆసక్తికరమైన విషయాలను పరిశోధక బృందం వెల్లడించింది. భూమికి 35 నుంచి 45 కిలోమీటర్ల లోతులో అగ్నిపర్వతాల నుంచి విడుదలైన సిసిలియా, క్వార్జ్‌ వంటి తేలికైన రసాయనాలు చల్లబడి పైకి తేలి భూమి ఏర్పడినట్లు సైంటిస్టులు తెలిపారు. ఇదంతా జరగడానికి కొన్ని వందల బిలియన్‌ సంవత్సరాలు పట్టి ఉండొచ్చని తెలిపారు.
కొన్ని ప్రత్యేక పోషకాలు సముద్ర నీటిలోకి చేరి ఆ నీటి నుంచి ఆక్సిజన్‌ తయారైందని, ఉపవాయువు పెరుగుదల దాదాపు 250 కోట్ల సంవత్సరాల కిందట ప్రారంభమైందనే ఏకాభిప్రాయానికి సైంటిస్టులు వచ్చారు. తర్వాత బీచ్, నివాసయోగ్యమైన భూమి ఏర్పడిందన్నది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడి తీరంలో ఉన్న నదీమార్గాలు, ఇసుకరాళ్లను విశ్లేషించిన అనంతరం ఈ అభిప్రాయానికొచ్చారు. అయితే ఎంత భూ భాగం ఏర్పడింది, ఇవి ఎంతకాలం అలా నీటిపై తేలుతూ ఉన్నాయన్నది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు.

ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ప్రియదర్శి చౌదరి మాట్లాడుతూ…ఇక్కడ(సింఘ్‌భూమ్‌) ప్రత్యేకమైన అవక్షేప శిలలను గుర్తించాం. వాటి వయసు, అవి ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పడ్డాయనే విషయంపై పరిశోధనలు చేశాం. ఆ శిలల్లో ఉన్న యురేనియం, లెడ్‌ కంటెంట్‌ను బట్టి వాటి వయసును కనుక్కోగలిగాం. ఆ రాళ్లు 310 కోట్ల సంవత్సరాల కిందటివని”ప్రియదర్శి చౌదరి తెలిపారు. దాదాపు ఇదే కాలంలో దక్షిణాఫ్రికాలోని కాప్‌వాల్‌ క్రాటన్, ఆస్ట్రేలియాలోని పిల్‌బరా క్రాటన్‌ ఏర్పడి ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

ఇదే కాకుండా ధార్వాడ్, బస్తర్, బుందేల్‌ఖండ్‌లలోనూ ఇలాంటి పురాతన భూభాగాలున్నాయని. వాటన్నంటినీ అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన దిక్సూచి అవుతుందని ప్రియదర్శి చౌదరి తెలిపారు.

ALSO READ CBI Team Under Attack : సీబీఐ అధికారులపై గ్రామస్థుల దాడి