రాహుల్ నచ్చాడు : కాంగ్రెస్ లోకి బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా

  • Published By: venkaiahnaidu ,Published On : March 28, 2019 / 02:56 PM IST
రాహుల్ నచ్చాడు : కాంగ్రెస్ లోకి బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా

బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా గురువారం(మార్చి-28,2019) కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. ఏప్రిల్-6,2019న కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు సిన్హా సృష్టం చేశారు.మూడు దశాబ్దాలపాటు బీజేపీతో తనకు ఉన్న అనుబంధాన్ని తెంచుకుని సిన్హా కాంగ్రెస్‌లో చేరుబోతున్నారు.తనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శత్రువు కాదని, బీజేపీలో తాను ఎదుర్కొన్న హింసను రాహుల్ గాంధీ గుర్తించారని చెప్పారు. 

బీహార్ లోని పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, రెండుసార్లు ఎంపీగా సిన్హా విజయం సాధించారు.అయితే కొంతకాలంగా పార్టీ అధినాయకత్వంపై బహిరంగా విమర్శలు చేయడం,కోల్ కతా లో జరిగిన విపక్షాల ర్యాలీకి హాజరవడం,కాంగ్రెస్ అధ్యక్షుడిపై ప్రశంసలు కురింపించడం వంటి కారణాలతో సిన్హాను ఈ ఎన్నికల్లో బీజేపీ పక్కనబెట్టింది.ఈ ఎన్నికల్లో పాట్నా అభ్యర్థిగా  కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను బీజేపీ నిలిపింది. దీంతో శత్రుఘ్న సిన్హా బీజేపీని వీడారు.