Sanjay Raut : అప్ఘాన్ పరిస్థితులను భారత విభజనతో పోల్చిన శివసేన..గాంధీకి బదులు జిన్నాని చంపి ఉంటే..

అప్ఘానిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని భారతదేశ విభజన నాటి పరిస్థితులతో పోల్చారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్.

Sanjay Raut : అప్ఘాన్ పరిస్థితులను భారత విభజనతో పోల్చిన శివసేన..గాంధీకి బదులు జిన్నాని చంపి ఉంటే..

Sanjay

Sanjay Raut అప్ఘానిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని భారతదేశ విభజన నాటి పరిస్థితులతో పోల్చారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. మహాత్మా గాంధీకి బదులుగా మహమ్మద్ అలీ జిన్నాను నాధూరాం గాడ్సే హత్య చేసి ఉంటే దేశ విభజన జరిగి ఉండేది కాదని శివసేన పత్రిక ‘సామ్నా’లో ‘రోఖ్‌ఠోక్’ పేరుతో ప్రతి వారం ఆయన రాసే వ్యాసంలో పేర్కొన్నారు. ఓ దేశ అస్తిత్వం, సార్వభౌమాధికారాల విధ్వంసం తాలూకు బాధ ఎలా ఉంటుందో నేటి ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులు గుర్తు చేస్తున్నాయన్నారు. అఫ్ఘానిస్తాన్ సైన్యం తోక ముడిచిందన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆగస్టు 14న విభజన విభీష్క స్మారక దినోత్సవాన్ని (దేశ విభజన ఘోరాలు గుర్తుకొచ్చే రోజు) జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించడాన్ని గుర్తు చేస్తూ..ఒకవేళ జిన్నాను గాడ్సే చంపినట్లయితే..ఆగస్టు 14 న విభజన స్మారక దినోత్సవాన్ని జరుపుకోవలసిన అవసరం ఉండేది కాదన్నారు. విడిపోయిన ముక్కను(పాకిస్తాన్) మళ్ళీ కలుపుకోకపోతే విభజన బాధ నుంచి ఉపశమనం ఎలా దొరుకుతుందని ప్రశ్నించారు. మనశ్శాంతి ఉండదన్నారు.

అఖండ్ హిందుస్థాన్ ఏర్పడాలని తామూ భావిస్తున్నామని, కానీ అది సాధ్యమయ్యేలా లేదని పేర్కొన్నారు. అయితే ఆశావాదం శాశ్వతంగా ఉంటుందన్నారు. ఒక వేళ ప్రధాని నరేంద్ర మోదీ అఖండ్ హిందుస్థాన్‌ను కోరుకుంటే స్వాగతిస్తామన్నారు. అప్పుడు పాకిస్తాన్‌ నుంచి వచ్చే 11 కోట్ల మంది ముస్లింల కోసం తన వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటో మోదీ చెప్పాలన్నారు. ఇక, గాంధీ రాజకీయాల్లో చురుకుగా లేనప్పుడు ముస్లింలను బ్రిటీషర్లు ప్రత్యేక ఓటర్లుగా గుర్తించారని, అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ముస్లింలను ప్రత్యేక ఓటర్లుగా గుర్తించేందుకు నెహ్రూ నిరాకరించారని రాశారు.