Shocking Video : పేలిన బుల్డోజర్ టైర్.. గాల్లోకి ఎగిరిపడి ఇద్దరు మృతి.. షాకింగ్ వీడియో
Shocking Video : ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బుల్డోజర్ టైరులో గాలి నింపుతుండగా ఒక్కసారిగా పేలింది.
Shocking Video : ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బుల్డోజర్ టైరులో గాలి నింపుతుండగా ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన రాయ్పూర్ జిల్లా సిల్తారా ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బుల్డోజర్ పెద్ద టైరులో గాలి నింపుతున్న సమయంలో ఒక వ్యక్తి.. టైరులో గాలి ఎంత వరకు ఎక్కిందని చెక్ చేస్తున్నాడు. బుల్డోజర్ టైరును గట్టిగా నొక్కాడు.
అంతే.. పెద్దఎత్తున శబ్దంతో బుల్డోజర్ టైరు పేలిపోయింది. ఈ టైరు పేలడంతో పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తులు గాలిలో పైకి లేచి ఎగిరిపడ్డారు. ఆ పేలుడు శబ్దానికి పెద్దఎత్తున దుమ్ము లేచింది. అక్కడి వారిద్దరూ గాల్లోకి ఎగిరి ప్రాణాలు కోల్పోయారు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
Two people were killed when a tyre of a JCB burst while they were filling air in it at a vehicle workshop in the Raipur @ndtv @ndtvindia pic.twitter.com/A4I9miCjNo
— Anurag Dwary (@Anurag_Dwary) May 5, 2022
మృతి చెందిన ఇద్దరు కార్మికులు రాజ్పాల్ సింగ్, ప్రంజన్ నాందేవ్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. టైరు పేలుడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బుల్డోజర్ టైరు పేలుడుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : OnePlus 9 Pro 5G : అమెజాన్లో వన్ప్లస్ 9ప్రోపై భారీ డిస్కౌంట్.. ఎంతంటే?