శానిటైజర్ రాసుకుని మరీ చోరీ చేసిన దొంగలు : దటీజ్ కరోనా

  • Published By: nagamani ,Published On : June 24, 2020 / 05:57 AM IST
శానిటైజర్ రాసుకుని మరీ చోరీ చేసిన దొంగలు : దటీజ్ కరోనా

రాజస్థాన్ లోని దౌల్ పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న రెండు కిరాణా దుకాణాల్లో చోరీ జరిగింది. తలుపులు మూసినవి మూసినట్లే ఉన్నాయి. వెనుక నుంచి షాపులోపటికి చక్కగా దూరిపోయారు. షాపులో ఉండే శానిటైజర్ తో చక్కగా చేతులు శుభ్రపరుచుకుని అక్క ఉన్న  తినుబండారాలను చక్కగా ఆరగించారు. ఆతరువాత తాపీగా మరోసారి చేతులు శానిటైజ్ చేసుకుని అందినకాడికి దోచేసుకుని అక్కడ నుంచి ఉడాయించారు.

ఉదయాన్నే యజమాని తలుపు తెరిచి చూడగా దొంగతనం విషయం బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించగా అక్కడ ఏర్పాటు చేసిన  అక్కడి సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగలు చేతులకు శానిటైజర్ రాసుకొని రూ. 5 వేల నగదుతోపాటు రూ.లక్ష  విలువైన నిత్యావసరాలు ఎత్తుకెళ్లారని గుర్తించారు. అంతకు ముందు వారంతా కలిసి దుకాణంలోనే తినుబండారాలతో చిన్నపాటి పార్టీ కూడా చేసుకున్నట్టు గుర్తించారు. దీంతో వారి కోసం గాలింపు మొదలుపెట్టారు. రెండు షాపుల్లోనే అలాగే చేశారు ఈ కరోనాకాలపు దొంగలు.

Read: వారం రోజులుగా  గూగుల్ లో ఏం వెతికారో తెలుసా?