Shraddha Murder Case : శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడిపై కత్తులతో దాడికి యత్నం
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితడు అఫ్తాబ్ పై దేశ రాజధాని ఢిల్లీలో కత్తులతో దాడికి యత్నించడం కలకలం రేపింది. అఫ్తాబ్ ను తీహార్ జైలుకి తరలిస్తుండగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది.
Shraddha Murder Case : దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితడు అఫ్తాబ్ పై దేశ రాజధాని ఢిల్లీలో కత్తులతో దాడికి యత్నించడం కలకలం రేపింది. అఫ్తాబ్ ను తీహార్ జైలుకి తరలిస్తుండగా.. ఈ సంఘటన చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు.. పోలీస్ వాహనాన్ని అడ్డగించారు. తల్వార్లతో దాడికి యత్నించారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. వారిని అడ్డుకునే క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. అఫ్తాబ్ ను సురక్షితంగా అక్కడి నుంచి తరలించారు.
కాగా, దాడికి యత్నించిన వారు తమని తాము హిందూసేన కార్యకర్తలుగా చెప్పుకున్నారు. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ బయట ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ఐదుగురు పోలీసులు అఫ్తాబ్ పూనావాలాకు రక్షణగా ఉన్నారు.
శ్రద్ధా మృతదేహాన్ని ముక్కలు చేసేందుకు అఫ్తాబ్ వాడిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్న మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. వాటితో పాటు శ్రద్ధా రింగ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రద్ధాను ముక్కలుగా నరికిన అఫ్తాబ్.. ఆమె చేతి వేలికున్న రింగ్ ను.. తన కొత్త గర్ల్ ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇచ్చాడు. ఆ రింగ్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని శ్రద్ధా తండ్రికి చూపించగా.. ఆ రింగ్ తన కూతురిదేనని ఆయన గుర్తు పట్టారు. ఏ డేటింగ్ యాప్ తో అయితే శ్రద్ధాతో పరిచయం ఏర్పడిందో.. అదే డేటింగ్ యాప్ ద్వారా.. శ్రద్ధా మర్ఢర్ తర్వాత మరో అమ్మాయితో డేటింగ్ స్టార్ట్ చేశాడు అఫ్తాబ్. ఈ కేసులో పోలీసులు అఫ్తాబ్ గర్ల్ ఫ్రెండ్ ని (సైకాలజిస్ట్) కూడా విచారించారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
తన లివింగ్ పార్టనర్ శ్రద్ధా వాకర్ హత్య కేసులో అఫ్తాబ్ నిందితుడిగా ఉన్నాడు. మే 18న చత్తార్ పూర్ లోని తన ఫ్లాట్ లో శ్రద్ధాను హత్య చేశాడు అఫ్తాబ్. ఆమెని చంపాక.. మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. అనంతరం బాడీ పార్ట్స్ ను మూడు నెలల పాటు ఫ్రిడ్జ్ లో దాచాడు. ఆ తర్వాత సౌత్ ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో మృతదేహం భాగాలను డంప్ చేశాడు. నవంబర్ నెలలో శ్రద్ధా గురించి ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. నవంబర్ 12న పోలీసులు అఫ్తాబ్ ను అరెస్ట్ చేశారు.
తనతో సహజీవనం చేస్తున్న శ్రద్ధా వాకర్ ను అఫ్తాబ్ పూనావాలా మే 18న గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. వాటిని ఫ్రిడ్జ్ లో దాచాడు. ఆ తర్వాత వీలు చూసుకుని.. ఒక్కొక్కటిగా బాడీ పార్ట్స్ ను దగ్గర్లోని అటవీ ప్రాంతంలో పడేశాడు. నవంబర్ 10న శ్రద్ధ కనిపించడం లేదంటూ అతడి తండ్రి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టిన పోలీసులకు.. శ్రద్ధా వాకర్ దారుణ హత్యకు గురైనట్లు గుర్తించి షాక్ అయ్యారు.
ఢిల్లీలో ఆరు నెలల క్రితం జరిగిన శ్రద్ధ హత్య ఘటన ఇటీవలే వెలుగులోకి రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడు, శ్రద్ధ బాయ్ఫ్రెండ్ అఫ్తాబ్ ఇప్పటికే నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. కఠినమైన విచారణ తర్వాత అఫ్తాబ్ నిజాన్ని వెల్లడించడం ప్రారంభించాడు. అఫ్తాబ్కు చెందిన ఛతర్పూర్ ఫ్లాట్ నుంచి కీలకమైన సాక్ష్యాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. సాక్షులు లేనందున ఫోరెన్సిక్ నివేదికలు, కాల్ డేటా, సందర్భోచిత సాక్ష్యాలు.. ఈ కేసులో కీలకం కానున్నాయి.
శ్రద్ధా హత్య కేసు నిందితుడిపై కత్తులతో దాడికి యత్నం
#WATCH | Police van carrying Shradhha murder accused Aftab Poonawalla attacked by at least 2 men carrying swords who claim to be from Hindu Sena, outside FSL office in Delhi pic.twitter.com/Bpx4WCvqXs
— ANI (@ANI) November 28, 2022