Sidhu Moose Wala: సిద్ధూ మూస్ వాలా హత్య కారణంగా జైలులో గొడవలు
పంజాబీ సింగర్ సిద్దూ మూస్ వాలా హత్య తర్వాత పలువురు గ్యాంగ్స్టర్లు విభిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చేసిన పోస్టుల కారణంగా ఫిరోజ్పూర్ సెంట్రల్ జైలులో అల్లర్లు చెలరేగాయి. బుధవారం మధ్యాహ్నం జైలు వాతావరణమంతా హింసాపూరితంగా మారిపోయింది.
Sidhu Moose Wala: పంజాబీ సింగర్ సిద్దూ మూస్ వాలా హత్య తర్వాత పలువురు గ్యాంగ్స్టర్లు విభిన్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చేసిన పోస్టుల కారణంగా ఫిరోజ్పూర్ సెంట్రల్ జైలులో అల్లర్లు చెలరేగాయి. బుధవారం మధ్యాహ్నం జైలు వాతావరణమంతా హింసాపూరితంగా మారిపోయింది. డజనుకు పైగా వ్యక్తులు గాయాలకు గురయ్యారు. చిన్నపాటి గాయాలైన వారికి అక్కడే ట్రీట్మెంట్ ఇస్తుండగా తీవ్ర గాయాలైన వారిని హాస్పిటల్స్కు తరలించారు.
సింగర్ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్న గ్రూప్కు మరో గ్రూప్ మధ్య జరిగిన గొడవ ఈ హింసకు దారి తీసిందని జైలు అధికారులు వెల్లడించారు. మూస్ వాలా హత్యలో ప్రమేయం ఉన్నట్లు నివేదించినందుకు గ్యాంగ్ స్టర్ మన్ప్రీత్ సింగ్ మన్నాను ప్రొడక్షన్ వారెంట్పై కస్టడీలోకి తీసుకోనున్నారు .
“గ్యాంగ్స్టర్ మన్నాకు మద్దతు ఇస్తున్న ఒక వర్గం, హత్యలో అతని ప్రమేయం గురించి పోలీసులకు టిప్-ఆఫ్ ఇచ్చిందని వ్యతిరేక బృందం ఆరోపిస్తోంది. ఈ సమస్యపై ఘర్షణ పడ్డారు” అని వర్గాలు తెలిపాయి.
Read Also: సిద్ధూ హత్యతో దిగొచ్చిన ఆప్ సర్కారు.. వీవీఐపీలకు భద్రత కొనసాగింపు
జైలు లోపల భద్రతను కట్టుదిట్టం లోపించి.. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోతే, ఫిరోజ్పూర్ సెంట్రల్ జైలులో మళ్లీ పెద్ద రక్తపాత ఘర్షణ చెలరేగే అవకాశం ఉందని వర్గాలు పేర్కొన్నాయి. జైలు సూపరింటెండెంట్ పర్వీందర్ సింగ్ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.