Mangli In Karnataka Bypoll : బీజేపీ విజయం కోసం మస్కిలో మంగ్లీ ఆటా పాటా..

Mangli In Karnataka Bypoll : బీజేపీ విజయం కోసం మస్కిలో మంగ్లీ ఆటా పాటా..

Mnagli In Kanrnatak Poll

Singer Mangli Dhoom dham In Bypoll Campaign Karnataka : కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో గాయని మంగ్లీ అలియాస్‌ సత్యవతి రాథోడ్‌ మస్కి నియోజకవర్గంలో థూమ్ థామ్ చేస్తోంది. బీజేపీ పార్టీ తరపును ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. ఉగాది పర్వదినాన మంగ్లీ మస్కి నియోజకవర్గంలో తన ఆటపాటలతో ఓటర్లను ఆకట్టుకోవటానికి యత్నిచారు. మస్కి నియోజకవర్గంలోని అడవిబావి, హడగలి తాండాల్లో ఇంటింటా కలియతిరుగుతూ తాండా భాషలో మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను విశేషంగా ఆకట్టుకున్నారు మంగ్లీ.

చక్కటి వాయిస్ తో ఆకట్టుకునే మంగ్లీ పొలిటికల్ పార్టీ కోసం పాటుపడుతోంది. ఇటీవల.. ‘‘కన్నే అదిరింది అనే పాట’’ కన్నడిగులను కూడా కట్టి పడేసింది. దీంతో మంగ్లీ గాత్రాన్ని..ఆమెను ఎన్నికల ప్రచారంలో వాడేసుకుంటోంది కాషాయదళం. ‘‘కన్నే అదిరింది అనే పాట’’ తో విశేష ఆదరణ లభించడంతో ఆమెను ఎన్నికల ప్రచారంలోకి దింపింది బీజేపీ, దీంతో కర్ణాటకలోని ప్రవాసాంధ్ర క్యాంపులతో పాటు మస్కి పట్టణంలో కూడా ఆమె ప్రచారంలో పాల్గొన్నారు.

బీజేపీ ఓటు వేయండీ అంటూ మంగ్లీ ఓటర్లకు పిలుపునిస్తూ తనదైన శైలిలో పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ ఆకట్టుకుంటోంది. మస్కి ఉప ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్‌ కుమార్‌ కటీల్‌ సూచించారు. గత సోమవారం సాయంత్రం ముదుగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడేతూ..మా పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అన్ని విధాలుగా అభివృద్ధికి పెద్ద పీట వేస్తామని హామీలిచ్చారు. రైతులకు ఉపయోగపడే ఎన్‌ఆర్‌బీసీ 5ఏ ఉప కాలువను నిర్మిస్తామని రైతు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి తెలంగాణ నుంచి పనిగట్టుకుని మంగ్లీని తీసుకెళ్లి ప్రచారం చేయిస్తున్న బీజేపీ గెలుస్తుందో లేదో చూడాలి..