బీహార్ లో విషాదం..ఆరుగురు చిన్నారులు సజీవదహనం

బీహార్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అరరియా జిల్లాలోని కబియా గ్రామంలో మంగళవారం(మార్చి-30,2021)ఉన్నట్లుండి ఓ పూరి గుడిసెలో మంటలు చెలరేగాయి.

బీహార్ లో విషాదం..ఆరుగురు చిన్నారులు సజీవదహనం

Bihar

Bihar బీహార్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. అరరియా జిల్లాలోని కబియా గ్రామంలో మంగళవారం(మార్చి-30,2021)ఉన్నట్లుండి ఓ పూరి గుడిసెలో మంటలు చెలరేగాయి. కాసేపట్లోనే ఇల్లంతా మంటలు అలుముకున్నాయి. ఆ ఇంట్లో చిక్కుకున్న ఆరుగురు చిన్నారుల కేకలు విన్న కొందరు యువకులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు దట్టంగా అలుముకోవడంతో ఆ ప్రయత్నం వృధా ప్రయాసగానే మిగిలిపోయింది.

ఆరుగరు చిన్నారులు మంటల్లో చిక్కుకుని చనిపోయారు. అభంశుభం తెలియని చిన్నారులు మంటల్లో చిక్కుకుని చనిపోవడంతో గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆ చిన్నారుల తల్లిదండ్రులను ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు. ఆ చిన్నారుల తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో అందరూ ఇంట్లో కూర్చుని ఆడుకుంటున్నట్లు తెలిసింది.

ఇల్లు తగలబడిన విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే.. అప్పటికే జరగకూడని నష్టం జరిగిపోయింది. పోలీసులు చిన్నారుల మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. పూరి గుడిసె తగలబడిందన్న విషయం తెలిసిన వెంటనే వందల సంఖ్యలో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. అయితే.. మంటలు ఎలా రేగాయన్న దానికి ప్రస్తుతానికి కారణం తెలియరాలేదు. ఫైర్ డిపార్ట్‌మెంట్ వాహనం వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది.