సీఎంపై చెప్పు విసిరిన దుండగుడు
తమిళనాడు సీఎం పళనిస్వామికి ఆదివారం(మార్చి-31,2019) రాత్రి చేదు అనుభవం ఎదురైంది.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తంజావూరులో అన్నాడీఎంకే కూటమి అభ్యర్థి నాటరాజన్ తరపున సీఎం ప్రచారం చేశారు.అయితే సీఎం ప్రచార రథంపై నిలబడి ప్రసంగిస్తున్న సమయంలో ఓ దుండగుడు ఆయనను లక్ష్యంగా చేసుకుని చెప్పు విసిరాడు. అయితే నాటరాజన్ చేయి అడ్డుపెట్టడంతో అది సీఎంకి తగలలేదు.దీంతో ఈ ఘటన తమిళనాడులో సంచలనానికి తెరతీసింది.అయితే చెప్పు విసిరిన దుండగుడిని పోలీసులు ఇంకా పట్టుకోలేదు.
జనం భారీగా ఉండటంతో పాటు అక్కడ కెమెరాలు కూడా లేకపోవడంతో ఆగంతకుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే గతంలో కూడా ఇలా బహిరంగంగా ప్రజా ప్రతినిధులపై చెప్పులు విసిరిన ఘటనలు చాలానే ఉన్నాయి. గతేడాది బిహార్ సీఎం నితీశ్ కుమార్పై ఓ దుండగుడు చెప్పువిసిరాడు.మధ్య ప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సిధి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు కూడా ఓ యువకుడు ఆయనపై చెప్పు విసిరిన విషయం తెలిసిందే.