షాకింగ్ రిప్లైతో స్మృతీ ముఖం వాడిపోయింది

  • Published By: venkaiahnaidu ,Published On : May 10, 2019 / 02:15 AM IST
షాకింగ్ రిప్లైతో స్మృతీ ముఖం వాడిపోయింది

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(మే-8,2019) మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి గట్టి షాక్ తగిలింది.ప్రచారం సందర్భంగా అశోక్‌నగర్‌లో ప్రజలను ఉద్దేశించి స్మృతి మాట్లాడుతూ… కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీ ఇచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీకు వ్యవసాయ రుణమాఫీ అందిందా అని స్మృతి ప్రశ్నించారు. దీనికి అక్కడున్నవారంతా ఒక్కసారిగా అందింది.. అందింది..అందింది అంటూ ఆమెకు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు.
Also Read : భారతదేశపు డివైడర్… మోడీపై టైమ్స్ వివాదాస్పద హెడ్ లైన్

అంతేకాకుండా పదే పదే అవే నినాదాలు చేస్తూ ఆమె ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో కంగుతిన్న స్మృతి కాసేపు ప్రసంగం ఆపి ఆ తర్వాత కొనసాగించారు.ఇందుకు సంబంధించిన వీడియోను మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ట్విటర్‌ లో షేర్‌ చేసింది.ఇప్పుడు ప్రజలు కూడా ఈ అబద్ధాల కోరులకు నేరుగానే జవాబు ఇవ్వడం మొదలు పెట్టేశారు. అబద్ధాలు వ్యాప్తి చేసేవాళ్లు రండి పర్లేదుంటూ ఆ వీడియోను కాంగ్రెస్ షేర్ చేసింది.