Sniffer Dogs To Protect Cheetahs : ఆఫ్రికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల‌ ర‌క్షణ కోసం శునకాలకు శిక్షణ

ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశం నుంచి భారత్ కు తీసుకొచ్చిన చీతాలకు కుక్కలు రక్షణ ఇవ్వనున్నాయి.దీని కోసం జ‌ర్మ‌న్ షెఫ‌ర్డ్ జీతి శునకాలకు డాగ్ స్వాడ్ ట్రైనింగ్ ఇస్తోంది.

Sniffer Dogs To Protect Cheetahs : ఆఫ్రికా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల‌ ర‌క్షణ కోసం శునకాలకు శిక్షణ

Sniffer Dogs To Protect Cheetahs

Sniffer Dogs To Protect Cheetahs : ఆఫ్రికా ఖండంలోని నమీబియా దేశం నుంచి భారత్ కు తీసుకొచ్చిన చీతాలకు కుక్కలు రక్షణ ఇవ్వనున్నాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తగల జంతువు.. చీతా. పైగా వేటాడటంలో దిట్ట. కన్నుమూసి తెరిచేలోగా కంటికి కనిపించనంత దూరం పరుగెత్తగల జంతువు. అటువంటి చీతాకు కుక్కలు రక్షణ ఏంటీ అనే డౌట్ వచ్చి తీరుతుంది.కానీ ఇది నిజం. న‌మీబియా నుంచి భార‌త్‌కు తీసుకొచ్చి మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో‌ని కునో జాతీయ పార్కులో ఉంచిన‌ చీతాలకు కుక్కలతో ర‌క్ష‌ణ వ‌ల‌యం ఏర్పాటు చేయ‌బోతున్నారు.

దీని కోసం జ‌ర్మ‌న్ షెఫ‌ర్డ్ జీతి శునకాలకు డాగ్ స్వాడ్ ట్రైనింగ్ ఇస్తోంది. హర్యానా పంచకులలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీటీ) నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్‌లో జర్మన్ షెపర్డ్‌లు శిక్షణ పొందుతున్నాయి. శిక్ష‌ణ త‌రువాత ఇవి కునో నేష‌న‌ల్ పార్కులో చీతాల డాగ్ స్క్వాడ్ లో మోహరించనున్నాయి. ఇవి ప్రమాదాన్ని పసిగట్టి చిరుతలకు కొత్త వాతావరణంలో రక్షణ కల్పిస్తాయి.

ప్రత్యేక శిక్షణా కోర్సులో పులి చర్మం, ఎముకలు, ఏనుగు దంతాలు, ఎర్ర సాండర్లు, ఇతర అక్రమ వన్యప్రాణుల ఉత్పత్తులను గుర్తించడానికి కూడా ఈ జర్మన్ షెపర్డ్ శునకాలను శిక్షణ ఇస్తారు. ఈ కుక్కలకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్-ఇండియా (వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా) సహకారంతో శిక్షణ ఇస్తున్న‌ట్టు ఐటీబీపీ బేసిక్ ట్రైనింగ్ సెంటర్ ఐజీ ఈశ్వర్ సింగ్ దుహన్ తెలిపారు. వివిధ‌ నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడేలా ఏడు నెలల శిక్షణ ఉంటుందన్నారు. నేష‌న‌ల్ పార్కులో చిరుతలు, ఇతర జంతువులను వేటగాళ్ల నుంచి రక్షించడానికి ఈ కుక్కలు వచ్చే ఏప్రిల్‌లో డ్యూటీల్లో చేరనున్నాయి.

కాగా..1947లో మహారాజా రామానుజ్ ప్రతాప్ సింగ్ డియో జాతికి చెందిన చివరి చీతాను కాల్చి చంపిన తర్వాత 1952లో భార‌త్‌లో ఈ ర‌కం చిరుత‌లు అంతరించిపోయినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో..మొట్టమొదటిసారిగా ఓ ఖండం నుంచి మరో ఖండానికి అంటే ఆఫ్రికా ఖండం నుంచి ఆసియా ఖండానికి ఎనిమిది చీతాలను తరలించారు. ఖండాంతర స్థాన భ్రంశం ప్రాజెక్ట్‌లో భాగంగా న‌మీబియా నుంచి తీసుకొచ్చారు. ఆ చీతాలను ప్రధాని మోడీ తన పుట్టిన రోజున మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ పార్కులోకి విడుద‌ల చేశారు.