Sonia Gandhi: 400మందితో సిడబ్ల్యుసి సమావేశానికి సోనియాగాంధీ
ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ మే 13 నుంచి 15 వరకు రాజస్థాన్లోని ఉదయపూర్లో 'చింతన్ శివిర్' నిర్వహించబోతోంది. గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో గెలుపు కోసం..
Sonia Gandhi: ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ మే 13 నుంచి 15 వరకు రాజస్థాన్లోని ఉదయపూర్లో ‘చింతన్ శివిర్’ నిర్వహించబోతోంది. గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో గెలుపు కోసం.. అదే సమయంలో వచ్చే ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికలకు వ్యూహం సిద్ధం చేస్తుంది.
దీని గురించి మాట్లాడిన సోనియా గాంధీ.. “కాంగ్రెస్ చింతన్ శివిర్ కోసం మే 13, 14,15 తేదీల్లో ఉదయ్పూర్లో సమావేశం కాబోతున్నాం. ఈ సమావేశానికి దాదాపు 400 మంది కాంగ్రెస్ నేతలు చింతన్ శివిర్ లో హాజరుకానున్నారు. అన్ని కోణాల్లో సమతుల్య ప్రాతినిధ్యం కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం”
“చింతన్ శివిర్లో 6గ్రూపులుగా చర్చలు ఉంటాయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం, రైతులు, యువత, సంస్థాగత సమస్యలపై చర్చలు ఉండనున్నాయి. ఏ గ్రూప్లో పాల్గొనాలనే దాని గురించి ప్రతినిధులకు ఇప్పటికే తెలియజేశాం”
Read Also: సోనియా గాంధీతో గంటపాటు సమావేశమైన గులాం నబీ ఆజాద్
“మే 15వ తేదీ మధ్యాహ్నం ఉదయపూర్లో నవ్ సంకల్ప్ తీర్మానాలను CWC ఆమోదించిన తర్వాత అమలు చేస్తాం. పార్టీ వేగవంతమైన పునరుజ్జీవనానికి ఉదయపూర్ నుంచి స్పష్టమైన సందేశం వెళ్లేలా నేతలు సహకారం అందించాల”ని సోనియాగాంధీ కోరారు.
“కాంగ్రెస్ పార్టీ పటిష్టత, స్థితిస్థాపకతను ప్రదర్శించడానికి చింతన్ శివిర్ సమావేశం వీలు కల్పిస్తుంది. పార్టీ వల్ల ప్రతి ఒక్కరికీ మేలు జరిగింది. ఇప్పుడు ఆ రుణాన్ని పూర్తి స్థాయిలో చెల్లించే సమయం వచ్చింది. పార్టీ వేదికల్లో ఆత్మవిమర్శ చేసుకోవడం అవసరం. అవి ఆత్మవిశ్వాసం, నైతిక స్థైర్యం క్షీణించి, వినాశకరమైన వాతావరణం వ్యాప్తి చెందే విధంగా చేయకూడదు”
“కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే అనేక సైద్ధాంతిక, ఎన్నికల నిర్వాహక సవాళ్లను ఎదుర్కోవడానికి పునర్నిర్మించబడిన సంస్థను చింతన్ శివిర్ వేదికగా ప్రకటించాలని నిర్ణయించుకున్నాం. 6 గ్రూపులకు విస్తృత ఎజెండాను రూపొందించడానికి నేను సమన్వయ ప్యానెల్లను ఏర్పాటు చేశాం. ప్రతి గ్రూపులో చర్చ కోసం గుర్తించబడిన విస్తృత విషయాల గురించి తెలియజేయాల”ని ప్యానెల్ల కన్వీనర్లను సోనియాగాంధీ కోరారు.
చింతన్ శివిర్ లో చర్చించాల్సిన అంశాల ఆమోదానికి సిడబ్ల్యుసి సభ్యులంతా మద్దతు ఇస్తారని భావిస్తున్నానని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వెల్లడించారు.