Sonia Gandhi: 400మందితో సిడబ్ల్యుసి సమావేశానికి సోనియాగాంధీ
ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ మే 13 నుంచి 15 వరకు రాజస్థాన్లోని ఉదయపూర్లో 'చింతన్ శివిర్' నిర్వహించబోతోంది. గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో గెలుపు కోసం..

Sonia Gandhi: ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ మే 13 నుంచి 15 వరకు రాజస్థాన్లోని ఉదయపూర్లో ‘చింతన్ శివిర్’ నిర్వహించబోతోంది. గుజరాత్, హిమాచల్ ఎన్నికల్లో గెలుపు కోసం.. అదే సమయంలో వచ్చే ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికలకు వ్యూహం సిద్ధం చేస్తుంది.
దీని గురించి మాట్లాడిన సోనియా గాంధీ.. “కాంగ్రెస్ చింతన్ శివిర్ కోసం మే 13, 14,15 తేదీల్లో ఉదయ్పూర్లో సమావేశం కాబోతున్నాం. ఈ సమావేశానికి దాదాపు 400 మంది కాంగ్రెస్ నేతలు చింతన్ శివిర్ లో హాజరుకానున్నారు. అన్ని కోణాల్లో సమతుల్య ప్రాతినిధ్యం కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం”
“చింతన్ శివిర్లో 6గ్రూపులుగా చర్చలు ఉంటాయి. రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం, రైతులు, యువత, సంస్థాగత సమస్యలపై చర్చలు ఉండనున్నాయి. ఏ గ్రూప్లో పాల్గొనాలనే దాని గురించి ప్రతినిధులకు ఇప్పటికే తెలియజేశాం”
Read Also: సోనియా గాంధీతో గంటపాటు సమావేశమైన గులాం నబీ ఆజాద్
“మే 15వ తేదీ మధ్యాహ్నం ఉదయపూర్లో నవ్ సంకల్ప్ తీర్మానాలను CWC ఆమోదించిన తర్వాత అమలు చేస్తాం. పార్టీ వేగవంతమైన పునరుజ్జీవనానికి ఉదయపూర్ నుంచి స్పష్టమైన సందేశం వెళ్లేలా నేతలు సహకారం అందించాల”ని సోనియాగాంధీ కోరారు.
“కాంగ్రెస్ పార్టీ పటిష్టత, స్థితిస్థాపకతను ప్రదర్శించడానికి చింతన్ శివిర్ సమావేశం వీలు కల్పిస్తుంది. పార్టీ వల్ల ప్రతి ఒక్కరికీ మేలు జరిగింది. ఇప్పుడు ఆ రుణాన్ని పూర్తి స్థాయిలో చెల్లించే సమయం వచ్చింది. పార్టీ వేదికల్లో ఆత్మవిమర్శ చేసుకోవడం అవసరం. అవి ఆత్మవిశ్వాసం, నైతిక స్థైర్యం క్షీణించి, వినాశకరమైన వాతావరణం వ్యాప్తి చెందే విధంగా చేయకూడదు”
“కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొనే అనేక సైద్ధాంతిక, ఎన్నికల నిర్వాహక సవాళ్లను ఎదుర్కోవడానికి పునర్నిర్మించబడిన సంస్థను చింతన్ శివిర్ వేదికగా ప్రకటించాలని నిర్ణయించుకున్నాం. 6 గ్రూపులకు విస్తృత ఎజెండాను రూపొందించడానికి నేను సమన్వయ ప్యానెల్లను ఏర్పాటు చేశాం. ప్రతి గ్రూపులో చర్చ కోసం గుర్తించబడిన విస్తృత విషయాల గురించి తెలియజేయాల”ని ప్యానెల్ల కన్వీనర్లను సోనియాగాంధీ కోరారు.
చింతన్ శివిర్ లో చర్చించాల్సిన అంశాల ఆమోదానికి సిడబ్ల్యుసి సభ్యులంతా మద్దతు ఇస్తారని భావిస్తున్నానని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వెల్లడించారు.
- Punjab Congress : సిద్ధూపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే… సోనియాకు ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఫిర్యాదు..!
- Manickam Tagore On Rahul Tour : రాహుల్ రాకతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది-మాణిక్కం ఠాగూర్
- Jaggareddy : విద్యార్థులు ప్రాణాలు కోల్పోవద్దని సోనియా తెలంగాణ ఇచ్చారు : జగ్గారెడ్డి
- Rajasthan: నా రాజీనామా లేఖ సోనియా దగ్గరే ఉంది: రాజస్థాన్ సీఎం
- PK STrategy In congress: పార్టీ మీది..స్ట్రాటజీ నాది అంటున్న PK..అందుకే కాంగ్రెస్ కు అండగా ఉంటున్నానంటున్న రాజకీయ చాణుక్యుడు
1Salman Khan : కంగనాకి సపోర్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఇకపై నేను ఒంటరిదాన్ని కాదు అంటూ పోస్ట్..
2girl gang-raped: బాలికపై కారులో అత్యాచారం.. నిందితుల అరెస్టు
3Maharashtra Village: శివాజీ విగ్రహ తొలగింపుపై గ్రామస్థుల మధ్య రగడ: 30 మంది పోలీసులకు గాయాలు
4Prashant kishor : ఆ రాజకీయ నాయకుడు అంటే ప్రశాంత్ కిషోర్కు అమితమైన ఇష్టమట.. ఎవరా నేత?
5Gold Prices: తగ్గిన బంగారం ధర.. ఈరోజు ధరలు ఇవీ
6Sunitha : పక్షులు, ప్రకృతితో మమేకమైన సింగర్ సునీత
7Moon Soil Plant: చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో మొక్కల పెంపకం విజయవంతం
8Delhi Mundka fire: ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఇద్దరిపై కేసు నమోదు
9RGV : వాళ్ళు ఇకపై సినిమాలు దానికోసమే తీసుకోవాలి.. బాలీవుడ్ పై మరోసారి ఆర్జీవీ వ్యాఖ్యలు..
10Ap cm jagan : అలా చేయండి.. కేంద్ర మంత్రులకు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి
-
BJP Telangana: నేడు నగరానికి అమిత్ షా: బీజేపీ భారీ సభకు అన్ని ఏర్పాట్లు
-
CM Jagan : సీఎం జగన్ విదేశీ పర్యటన ఖరారు
-
Minister KTR : కేంద్రమంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ
-
Sameer Sharma : ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం పొడిగింపు
-
Meditation : మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానమే మార్గమా!
-
Ginger and Garlic : ఆరోగ్యానికి అల్లం, వెల్లుల్లి చేసే మేలు ఎంతంటే?
-
Saroor Nagar : సరూర్నగర్ పెంపుడు తల్లి హత్య కేసులో నిందితుల అరెస్ట్
-
Pushpa2: పుష్ప-2పై ‘భారీ’గా వెళ్తున్న సుకుమార్..?