Sonia Gandhi: ‘భారత్ జోడో యాత్ర’లో సోనియా.. ఈ నెల 6న పాల్గొనే అవకాశం

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’లో ఆ పార్టీ అధినేత్రి, రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ పాల్గొనబోతున్నారు. ఈ నెల 6న ఆమె యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది.

Sonia Gandhi: ‘భారత్ జోడో యాత్ర’లో సోనియా.. ఈ నెల 6న పాల్గొనే అవకాశం

Sonia Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ సజావుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చే ఉద్దేశంతో రాహుల్ దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. గత నెల ఏడున కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో సాగుతోంది.

TRS Or BRS: టీఆర్ఎస్ కాదు.. ఇకపై బీఆర్ఎస్! దసరా రోజే ప్రకటన.. ముహూర్తం ఖరారు చేసిన కేసీఆర్

ఈ యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ నెల 6న గురువారం సోనియా గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొనబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ యాత్రలో సోనియా పాల్గొనబోతుండటం ఇదే మొదటిసారి. యాత్ర ప్రారంభమైన సమయంలో కూడా ఆమె హాజరుకాలేదు. వైద్య పరీక్షల కోసం విదేశాలకు వెళ్లడంతో ఆ సమయంలో ప్రారంభ కార్యక్రమానికి హాజరుకాలేదు. అయితే, యాత్ర ప్రారంభమై నెల రోజులు కావొస్తుండటంతో సోనియా ఈ యాత్రలో పాల్గొనబోతున్నారు.

CM KCR New Party: దసరా రోజు మరోసారి పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ.. ఆ రోజే కొత్త పార్టీపై ప్రకటన?

అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, రాహుల్ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ కాంగ్రెస్ పార్టీకి చాలా కీలకంగా మారింది. ఈ యాత్ర ద్వారా దేశ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే అన్ని రాష్ట్రాల్లో రాహుల్ యాత్ర చేస్తున్నారు. త్వరలో తెలంగాణలో కూడా యాత్ర చేపట్టబోతున్నారు.