Rajasthan : మాతృదినోత్సవం రోజే..తోపుడు బండిపై అమ్మ అంతిమయాత్ర

తన తల్లి చనిపోయిందని, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరిన కొడుకులకు నిరాశే మిగిలింది. చివరకు ఆ తల్లిని తోపుడు బండిపై అంతిమయాత్ర నిర్వహించారు సొంత కొడుకులు.

Rajasthan : మాతృదినోత్సవం రోజే..తోపుడు బండిపై అమ్మ అంతిమయాత్ర

Rajasthan sons

Sons Carry Mother Corpse : కరోనా మహమ్మారి మనుషుల మధ్య చిచ్చు పెడుతోంది. అనుబంధాలు తెగిపోతున్నాయి. కన్నవాళ్లనే వదిలేస్తున్నారు. అయితే..తన తల్లి చనిపోయిందని, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని కోరిన కొడుకులకు నిరాశే మిగిలింది. చివరకు ఆ తల్లిని తోపుడు బండిపై అంతిమయాత్ర నిర్వహించారు సొంత కొడుకులు. మాతృదినోత్సవం రోజే ఈ హృదయవిదారక ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రాజస్థాన్‌లోని నావల్‌పురా చౌక్‌కు దినేష్ కుమార్ కుటుంబం నివాసం ఉంటోంది. ఇతని తల్లికి కరోనా సోకింది. స్థానిక ఆసుపత్రిలో చేరిపించారు. అయితే..ఇక్కడ చికిత్స వద్దని..ఇంటికి తీసుకెళ్లాలని కొడుకులను కోరడంతో..ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. అయితే..శనివారం ఆమె మరణించింది.

దీంతో చివరి కార్యక్రమాలు చేసేందుకు, శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలని అధికారులను, పోలీసులను కోరారు. అయితే..వారు పట్టించుకోలేదు. మృతురాలి ఇద్దరు కొడుకులు ఎంత కోరుకున్నా..కనికరించలేదు. కరోనాతో మృతి చెందిందని తెలుసుకున్న గ్రామస్థులు కూడా వీరికి సహకరించలేదు. చివరకు అక్కడున్న తోపుడు బండిపై మృతదేహాన్ని తీసుకెళ్లారు కొడుకులు.

Read More : Visakha : గర్భిణీని కోసం వచ్చిన అంబులెన్స్‌ను అడ్డుకున్న గ్రామస్థులు