కరోనా​ కట్టడికి కేంద్రం ప్రత్యేక బృందాలు

కరోనా​ కట్టడికి కేంద్రం ప్రత్యేక బృందాలు

corona control:దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న వేళ కేంద్రం అత్యున్నత స్థాయి బృందాలను ఏర్పాటు చేసింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కేరళ, గుజరాత్, పంజాబ్, జమ్ముకశ్మీర్​, కర్ణాటక రాష్ట్రాలకు కేంద్రం ఉన్నత స్థాయి బృందాలను పంపింది.

ముగ్గురు సభ్యులుండే ఈ బృందాలకు ఆరోగ్య శాఖలోని జాయింట్​ సెక్రటరీ లెవల్​ అధికారి అధ్యక్షత వహిస్తారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాని కట్టడి చేయడంలో స్థానిక ప్రభుత్వాలకు ఈ బృందాలు అండగా నిలవనున్నాయి.

కరోనా​ ఉద్ధృతికి కారణాలేంటనే అంశంపై ఈ బృందాలు ఆరాతీయనున్నాయి. కరోనా కట్టడికై పలు ప్రాంతాల్లోని ఆరోగ్య సిబ్బందికి సహాయం చేయనున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.