రేపట్నించే ప్రత్యేక రైళ్ళు.. విధి విధానాలు విడుదల చేసిన రైల్వే శాఖ

  • Published By: murthy ,Published On : May 31, 2020 / 01:10 PM IST
రేపట్నించే ప్రత్యేక రైళ్ళు.. విధి విధానాలు విడుదల చేసిన రైల్వే శాఖ

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను సడలిస్తూ  కేంద్ర ప్రభుత్వం శనివారం మార్గదర్శకాలు వెలువరించిన నేపథ్యంలో రైళ్లను నడిపేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ సిద్ధమైంది. రేపటి నుంచి (జూన్‌1) దేశ వ్యాప్తంగా 200 రైళ్లను నడుపనున్నట్టు భారతీయ రైల్వేశాఖ ఆదివారం ప్రకటించింది. ఈ రైళ్ల ద్వారా తొలిరోజున దాదాపు 1.45 లక్షల మంది ప్రయాణికులను చేరవేయనున్నట్లు తెలిపింది. ఈ నేపధ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు కీలక సూచనలు చేశారు. 
 

> రైలు బయల్దేరడానికి 90 నిమిషాల ముందే స్టేషన్‌కు రావాలని సూచించించారు. 
> టికెట్లు ఉన్నవారికి మాత్రమే రైల్వే ప్రాంగణం, రైళ్లలోకి అనుమతి ఉంటుంది. 
> ఈ రైళ్లకు రిజర్వు చేయని టికెట్లు జారీ చేయమని అధికారులు చెప్పారు. 
> కరోనా లక్షణాలున్న ప్రయాణికులను అనుమతించమని స్పష్టం చేశారు. 
> రైళ్లలో ప్రయాణికులకు దుప్పట్లు ఇవ్వబోమని పేర్కొన్నారు. 
> ప్రతి ఒక్కరూ కనీస సామాన్లతోనే ప్రయాణించాలి. 

> అనారోగ్యంతో ఉన్న వారు ప్రయాణం చేయకపోవడమే మంచిది. 
> రేపటి నుంచి రైళ్లలో ప్రయాణించే వారు విధిగా ముఖానికి మాస్క్‌ ధరించాలి.
> గర్భిణీలు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వాళ్లు ప్రయాణించవద్దు. 
> టిక్కెట్‌ కన్ఫామ్‌ అయినవాళ్లు, ఆర్‌ఏసీ పొందినవారు మాత్రమే ప్రయాణించేందుకు సిద్ధం కావాలని సూచించింది.
> రైళ్లలో వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. 
> రైల్వే ప్రాంగణాలు, రైళ్లను శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలి అని అధికారులు కోరారు.