Delhi: ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు.. డ్రైవర్‌పై దాడి చేసిన స్థానికులు

కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంతో అదుపుతప్పిన కారు ఫుట్‌పాత్‌పై ఉన్న పిల్లలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి.

Delhi: ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు.. డ్రైవర్‌పై దాడి చేసిన స్థానికులు

Delhi: ఢిల్లీలో దారుణం జరిగింది. డ్రైవర్ అతివేగంతో అదుపుతప్పిన కారు ఫుట్‌పాత్‌పై ఉన్న పిల్లలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం ఉత్తర ఢిల్లీలోని లీలావతి స్కూల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రతాప్ నగర్ ప్రాంతానికి చెందిన గజేంద్ర అనే వ్యక్తి బ్రీజా కారులో వెళ్తుండగా, అతివేగం కారణంతో కారు అదుపుతప్పింది.

Maharashtra: బాలికపై పన్నెండు గంటలపాటు సామూహిక అత్యాచారం.. 8 మంది నిందితులు అరెస్ట్

వెంటనే కారు ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. దీంతో ఫుట్‌పాత్‌పై ఉన్న ముగ్గురు పిల్లలు దూరంగా ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో పిల్లలకు గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు చిన్నారుల్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఒక చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పాప పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారికి చికిత్స కొనసాగుతోందని, మరికొంతకాలం అబ్జర్వేషన్‌లో ఉంచాలని అధికారులు తెలిపారు. మిగతా చిన్నారులు కూడా గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన వెంటనే గజేంద్ర తన కారును ఆపాడు.

దీంతో స్థానికులు అతడిపై దాడికి పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. గాయాలపాలైన ఇద్దరు పిల్లల వయస్సు పది సంవత్సరాలు కాగా, తీవ్రంగా గాయపడ్డ చిన్నారి వయసు ఆరు సంవత్సరాలు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు దగ్గర్లోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.