Spittoon Pouch : వావ్.. ఉమ్మితే మొక్కలు పెరుగుతాయ్.. ఖర్చు తగ్గించుకునేందుకు ఇండియన్ రైల్వేస్ ఐడియా

కొందరు ప్రయాణికుల చేష్టల వల్ల రైల్వేకి పెద్ద సమస్య వచ్చింది. వారి చర్యల కారణంగా ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. ఆ ఖర్చుని తగ్గించుకునేందుకు ఇండియన్ రైల్వేస్ కొత్త విధానానికి

Spittoon Pouch : వావ్.. ఉమ్మితే మొక్కలు పెరుగుతాయ్.. ఖర్చు తగ్గించుకునేందుకు ఇండియన్ రైల్వేస్ ఐడియా

Spittoon Pouch

Spittoon Pouch : ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఇండియన్ రైల్వేస్. మన దేశంలో అతిపెద్ద ప్రజా రవాణ వ్యవస్థ కూడా ఇండియన్ రైల్వేస్. భారతీయ రైల్వే నిత్యం లక్షలాది మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రైలు సామాన్యుడి విమానం.

Face Book Friend Cheating : ఫేస్‌బుక్ లో పరిచయం….రూ. 27లక్షలు దోచేసిన యువతులు

అయితే, కొందరు ప్రయాణికుల చేష్టల వల్ల రైల్వేకి పెద్ద సమస్య వచ్చింది. వారి చర్యల కారణంగా ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. మ్యాటర్ ఏంటంటే.. చాలామంది రైల్వే ప్రయాణికులు గుట్కాలు, పాన్ లు, పొగాకు నమిలి ఉమ్మి వేయడం వల్ల రైళ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో మరకలు పడటం సర్వసాధారణంగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు రైల్వే శాఖ పలు చర్యలు తీసుకుంటోంది. ఎవరైనా రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఉమ్మి వేస్తూ కనిపిస్తే రూ.500 జరిమానా విధిస్తోంది. అయినా సరే కొందరు మారడం లేదు.

దసరా పండుగ, ఆర్టీసీ బస్సుల్లో అదనపు చార్జీలు ఉండవ్

ఇలా సదరు వ్యక్తులు నిర్లక్ష్యంగా ఉమ్మి వేయడం వల్ల ఏర్పడిన మరకలు తొలగించడం కోసం రైల్వే శాఖ భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనికోసం భారీ మొత్తంలో నీటితోపాటు సుమారు 12 వేల కోట రూపాయలను రైల్వే శాఖ ఏటా ఖర్చు చేస్తున్నట్లు అంచనా. ఈ క్రమంలో పశ్చిమ, ఉత్తర, సెంట్రల్ రైల్వేలకు చెందిన 42 స్టేషన్లలో కొత్త విధానానికి భారతీయ రైల్వే శ్రీకారం చుట్టింది.

నాగ్‌పూర్‌కు చెందిన ఈజీస్పిట్‌ అనే స్టార్టప్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వెస్టర్న్, నార్తర్న్, సెంట్రల్ రైల్వే వ్యవస్థలకు చెందిన మొత్తం 42 రైల్వే స్టేషన్లలో వెండింగ్ మెషీన్ల వంటి వాటిని ఏర్పాటు చేస్తారు. వీటిలో రూ.5 నుంచి రూ.10కు ఒక పౌచ్ అమ్మనున్నారు. ప్రయాణికులు వీటిని కొనుక్కోవాలి. జేబులో పెట్టుకోవాలి. అందులోనే ఉమ్మాలి. వీటిలో కనీసం 10-15 సార్లు ఉమ్మివేయొచ్చు. అలాగే ఇవి పర్యావరణానికి ఎటువంటి హానీ చేయవు.

పౌచ్ లో ఉమ్మాక, ఆ ఉమ్మి నుంచి బ్యాక్టీరియా బయటకు రాకుండా టెక్నాలజీ వాడారు. ఉమ్మి ఘన పదార్థంగా మారుతుంది. దాన్ని బయటపడేస్తే పౌచ్ లోని గింజలు ఉమ్మిలోని పోషకాలను వినియోగించుకుని మొక్కలుగా పెరుగుతాయ్.

”ఈ పౌచ్‌లలో ఉండే కొన్ని గింజలు మనుషుల లాలాజలం నుంచి పోషకాలను తీసుకుని, నేలపై పడేసినప్పుడు మొక్కలుగా ఎదుగుతాయి” అని ఈజీస్పిట్‌ సహ వ్యవస్థాపకుడు రితు మల్హోత్రా తెలిపారు. ప్రస్తుతానికి తమ కంపెనీ ఏడాది పాటు భారతీయ రైల్వేస్‌తో ఒప్పందం కుదుర్చుకుందని ఆయన తెలిపారు.