Supreme Court questions CBI, ED : సాగదీయటం తప్ప తేల్చరేంటీ? ఎన్ని స్కాముల కేసులు నిర్ధారించారో చెప్పండి : సీబీఐ, ఈడీలపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు

సంవత్సరాల తరబడి సాగదీస్తారు..కేసుల్ని తేల్చరు దానికి మీకుండే ఇబ్బందు మీకుండొచ్చు కానీ ఇది సరైందికాదు అంటూ ఆర్థిక కుంభకోణాల కేసుల విషయంలో సీబీఐ, ఈడీలపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Supreme Court questions CBI, ED : సాగదీయటం తప్ప తేల్చరేంటీ? ఎన్ని స్కాముల కేసులు నిర్ధారించారో చెప్పండి : సీబీఐ, ఈడీలపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు

Supreme Court questions CBI, ED

Supreme Court questions CBI, ED : ఆర్థిక కుంభకోణాలకు పాల్పడేవారిపై ఈడీ, సీబీఐ సంస్థలు దాడులు చేయటం ఆస్తులు సీజ్ చేయటం కేసులు నమోదు చేయటం దర్యాప్తులు కొనసాగించటం జరుగుతుంటుంది. కానీ నమోదు చేసిన కేసుల్లో ఎన్ని కేసులు నిర్ధారించబడుతున్నాయి? కేసులు నమోదు చేసినవారంతా ఆర్థిక నేరాలాకు పాల్పడినట్లుగా నిర్దారించబడ్డాయా? వారిపై అభియోగించబడిన ఆరోపణలు నేరాలుగా (ఆర్థిక కుంభకోణం చేసినట్లుగా) నిర్ధారణం జరిగిందా? అంటే కాస్త ఆలోచించాల్సిందే. ఈడీ, సీబీఐ సంస్థల అధికారులు నమోదు చేసిన కేసులు ఎన్ని తేలాయా? ఎన్ని నేరాలు నిర్థారించబడ్డాయి? అంటే సమాధనం లేదు. సరిగ్గా ఇదే విషయంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఈడీ, సీబీఐ సంస్థలను ప్రశ్నించింది..ఏళ్ల తరబడి సాగదీస్తారు తప్ప ఇప్పటి వరకు మీరు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎన్ని కేసుల్ని తేల్చారో చెప్పండీ అంటూ సీబీఐ, ఈడీ సంస్థలను ప్రశ్నించింది. దీనికి సంబంధించి అన్ని వివరాలను సోమవారంలోగా తెలపండీ అంటూ గురువారం (జనవరి 5,2023) ఆదేశించింది.

ఈ సందర్భంగా న్యాయస్థానం సీబీఐ,ఈడీ సంస్థలపై కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్‌ ఎం.ఆర్‌.షా మాట్లాడుతూ.. ‘‘ఆర్థిక కుంభకోణాల్లో కేసుల విచారణలు సీబీఐ, ఈడీల చేతికి వచ్చినపుడల్లా ఆలస్యమే జరుగుతోంది. కేసుల్ని ఏళ్లతరబడి సాగదీస్తారు. ఇప్పటిదాకా ఎన్ని ఆర్థిక కుంభకోణాల కేసులను సరిగ్గా తేల్చారో మాకు చెప్పండి? మీకు మీరు నమోదు చేసిన కేసుల సంఖ్య ఎక్కువగా ఉండి వాటి దర్యాప్తు భారం ఎక్కువగా ఉండవచ్చు. ఈ కేసుల దర్యాప్తుకు సరిపడినంత సిబ్బంది మీకు లేకపోవచ్చు. సీబీఐ అధికారులంతా ఎక్సైజ్‌, కస్టమ్స్‌ శాఖల నుంచి డిప్యుటేషన్లపై వచ్చినవారు ఉన్నారు. వారికి విచారణల గురించి తెలియదు. ఆ విషయం నాకు కూడా తెలుసు ఎందుకంటే నేను కూడా సీబీఐకి ప్రాతినిధ్యం వహించాను. ఐదున్నరేళ్లు పనిచేశాను కాబట్టి నాకు అంతా తెలుసు అని అన్నారు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా. దీనిపై మళ్లీ మళ్లీ వాయిదాలు ఉండవని..శనివారం అన్ని సమర్పిస్తే సోమవారం విచారిస్తాం అని అన్నారు జస్టిస్ షా.మరింత అప్రమత్తంగా ఉండాలని మీ శనివారం నాటికల్లా సమాధానం ఏమిటో తెలియజేయండి అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉద్దేశించి అత్యున్నత న్యాయస్థానం గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం ఒడిశాకు చెందిన ఓ ఆర్థిక కుంభకోణంపై దాఖలైన పిటిషను విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం. సీబీఐ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది రాతపూర్వక సమాధానం ఇవ్వటానికి వాయిదా కోరగా న్యాయమూర్తులు సీబీఐ, ఈడీలపై ఘాటుగా ఈ వ్యాఖ్యలు చేశారు. కష్డపి సంపాదించిన డబ్బు పోగొట్టుకున్నవారికే ఆ ఇబ్బంది, బాధ తెలుస్తుంది అంటూ వ్యాఖ్యానించారు.

ఒడిశాతోపాటు పశ్చిమబెంగాల్‌, త్రిపుర, అస్సాం రాష్ట్రాల్లో ఈ కుంభకోణం రూ.10 వేల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టినట్లు పిటిషనరు పినాక్‌ పాణి మొహంతి కోర్టు దృష్టికి తెచ్చారు. ‘‘ఇది ప్రజల డబ్బు. మేము 10,20,30 ఏళ్లు ఆగలేం. ఈ కుంభకోణానికి పాల్పడినవారు జైలులో ఉన్నా, ప్రజల డబ్బును అనుభవిస్తున్నారు. అదే డబ్బుతో ఈ కేసులో పోరాడుతున్నారు. ఇలాంటి కేసుల్లోని ప్రజాధనం ఎక్కడికి పోతోంది? వ్యక్తులు ఎవరైనా కావచ్చు. వాళ్లు లండన్‌, అమెరికా వంటి చోట్ల ఉండి ఈ డబ్బు అనుభవిస్తూ ఉండవచ్చు. ఇటువంటి వ్యవస్థను మార్చాలి’ అని జస్టిస్‌ షా అన్నారు.